ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పార్టీలో గుడివాడ విషయం ఆసక్తికర చర్చకు దారితీసింది.ఇక రాజకీయ పరంగా దీనిని వాడుకో లేక పోయామా? అనే చర్చ ఇప్పుడు సాగుతోంది.ఇక సంక్రాంతి సందర్భంగా..మంత్రి కొడాలి నాని యొక్క సొంత నియోజకవర్గం .. ఆయన సొంత కన్వెన్షన్ సెంటర్లో గోవా లాంటి క్యాసినో నిర్వహించారు.ఇక దీనికి సంబంధించి మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఇందులో ఎంట్రీ ఫీజు రూ.10 వేలు ఉందని.. కేవలం మూడు రోజుల్లోనే రూ.200 కోట్లు సంపాదించుకున్నారని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై టీడీపీ పార్టీ నేతలు ఫస్ట్ లో లైట్ తీసుకున్నారు. ఒక్కరిద్దరు నేతలు మాత్రమే స్పందించారు.అయితే ముఖ్యమైన ఇంత పెద్దవ్యవహారాన్ని పార్టీ సీరియస్ గా తీసుకోలేదనే విమర్శలు కూడా వచ్చాయి.ఇక ప్రధానంగా తమను పదే పదే టార్గెట్ చేస్తున్న మంత్రి కొడాలి నానిని అడ్డంగా బుక్ చేసేందుకు వచ్చిన బంపర్ అవకాశాన్ని మిస్ చేసుకున్నారని.. కొంతమంది నాయకులు మల్లగుల్లాలు పడ్డారు. ఫస్ట్ నుంచి కూడా కొడాలి నాని టీడీపీ పార్టీ అధినేతను టార్గెట్ చేస్తున్నారు. అయితే.. ఇప్పటి దాకా రాజకీయంగానే ఎదుర్కొన్న నాయకులకు ఇప్పుడు మంత్రిని బలంగా ఎదుర్కొనేందుకు గుడివాడ ఇష్యూ లభించడం జరిగింది.

ఇక ఈ నేపథ్యంలో దీనిని సరైన విధగా వాడలేదని ఇంకా మంత్రిని అనుకున్న విధంగా టార్గెట్ చేయలేక పోయామని కొంతమంది నాయకులు భావిస్తున్నారు.ఇక ఈ నేపథ్యంలోనే టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఆగమేఘాలపై స్పందించడం జరిగింది. గుడివాడ ఘటనపై నిజనిర్ధారణ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. టీడీపీ పార్టీ నిజనిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. ఇక ఈ మేరకు పొలిట్బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర అలాగే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి ఇంకా ఆలపాటి రాజా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలతో కూడిన ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన మేరకు వారు శుక్రవారం నాడు గుడివాడలో పర్యటించి..కేసినోపై నిజాలను పరిశీలించే ప్రయత్నం చేస్తారు. అలాగే మచిలీపట్నం మాజీ ఎంపీ అయిన కొనకళ్ల నారాయణ ఈ కమిటీకి సమన్వకర్తగా వ్యవహరిస్తారు. ఇక కొడాలి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన క్యాసినోపై కమిటీ పూర్తిస్థాయి నివేదికను రూపొందించి అధిష్టానానికి ఇవ్వబోతుంది. జూదాలతో ఈ రాష్ట్రాన్ని వైసీపీ పార్టీ ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా భ్రష్టుపట్టిస్తోందని అచ్చెన్నాయుడు మండిపడటం జరిగింది. మరి ఇప్పటికే తీవ్రస్థాయిలో జాప్యం జరిగిన ఈ ఘటనపై నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఇక చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: