వైసీపీ ఎంపీకి తమ్ముళ్ళ సపోర్ట్...అదేంటి వైసీపీ ఎంపీ ఏంటి..ఆ ఎంపీకి టీడీపీ శ్రేణులు మద్ధతు ఇవ్వడం ఏంటి? అని డౌట్ రావొచ్చు. అయితే ఇక్కడే కొన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. అసలు వైసీపీ అంటే తమ్ముళ్ళు రగిలిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీ వల్ల తెలుగు తమ్ముళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు....అందుకే నెక్స్ట్ అధికారంలోకి వస్తే వైసీపీకి చుక్కలు చూపించాలని తమ్ముళ్ళు చూస్తున్నారు.

ఆ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం అని లేదు...అన్నిచోట్ల తమ్ముళ్ళు, వైసీపీ నేతల అంటే పీకల్లోతు కోపం పెట్టుకుని ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది నేతల పట్ల తమ్ముళ్ళు కాస్త పాజిటివ్‌గా కనిపిస్తున్నారు. అలా నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పట్ల తమ్ముళ్ళు పాజిటివ్‌గానే ఉన్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల అందరిదీ ఒక దారి అయితే..శ్రీకృష్ణది మాత్రం ఒక దారి అన్నట్లు ఉంది. ఎందుకంటే మిగిలిన నేతల మాదిరిగా శ్రీకృష్ణ ఎప్పుడు టీడీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు దిగలేదు.

అలాగే చంద్రబాబుపై గాని, టీడీపీ నేతలపై గాని విమర్శలు చేయలేదు. పైగా వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగానే శ్రీకృష్ణ ఉన్నారు. ఎమ్మెల్యేల వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే వారికి అండగా ఉంటున్నారు. ఇటీవల వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఓ రైతు మధ్య జరిగిన గొడవ సంగతి తెలిసిందే. అలాగే ఆ రైతుని బొల్లా జైల్లో కూడా పెట్టించారు. ఈ విషయంలో ఎంపీ శ్రీకృష్ణ మాత్రం రైతు వైపే ఉన్నారు. రైతుని బయటకు తీసుకురావడం కోసం పనిచేశారు.

ఇలా శ్రీకృష్ణ న్యూట్రల్‌గా ఉంటూ ప్రజల మద్ధతు పొందుతున్నారు. ప్రజల మద్ధతే కాదు...తెలుగు తమ్ముళ్ళ మద్ధతు కూడా పొందుతున్నారు. పైగా కమ్మ నేత కావడంతో నరసారావుపేటలో ఉన్న కమ్మ వర్గం...ఎంపీ పట్ల పాజిటివ్‌గానే ఉన్నారు. ఇలా నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అందరివాడుగా ఉంటూ...తెలుగు తమ్ముళ్ళ సపోర్ట్‌ కూడా దక్కించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: