ఇలా ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు, 4 వేలకు పైగా అదనపు బస్సులను నడిపించిన టీఎస్ఆర్టీసీకి ఆదాయం కూడా రికార్డు స్థాయిలోనే వచ్చిందట. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు 107 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేకంగా బస్సులను నడిపింది అదనంగా 4 వేలకు పైగా బస్సులను తిప్పింది.
అయితే.. ఏపీఎస్ ఆర్టీసీ.. ఆదాయంతో తెలంగాణను మించిపోయిందట. సంక్రాంతి పండుగకు ఎపీఎస్ ఆర్టీసీకి 144 కోట్ల ఆదాయం వచ్చిందట. పలు ప్రాంతాలకు ఏపీఎస్ ఆర్టీసీ 5422 ప్రత్యేక బస్సులు నడిపింది. ఏపీ నుంచి హైదరాబాద్ కే 1350 బస్సులు నడిపిందట ఏపీఎస్ ఆర్టీసీ … ఈ నెల 7 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడిపిన ఏపీఎస్ ఆర్టీసీ... జనవరి 17ఒక్కరోజే 15.40కోట్ల ఆదాయం సంపాదించిదట.
ఇక జనవరి 17న అత్యధిక సంఖ్యలో 36లక్షల మంది ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని ఆ సంస్థ ఎండి చెబుతున్నారు. ఇంకా కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా చెన్నై, బెంగళూరు నుంచి ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందట. లేకపోతే ఇంకాస్త అధికంగా ఆదాయం వచ్చేదని.. ఇంతగా
ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ధన్యవాదాల అని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు ఓ ప్రకటనలో తెలిపారు.