ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాల‌యం ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న క్యాబినెట్ స‌మావేశం నిర్వ‌హించారు. దాదాపు 2 గంట‌ల‌కు పైగా జ‌రిగిన ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం ల‌భించిన‌ది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం కొవిడ్ ప‌రిస్థితితో పాటు ఉద్యోగుల పీఆర్‌సీ, హెచ్ఆర్ఏ స‌హా ప‌లు అంశాల‌పై చ‌ర్చ సాగ‌గా.. కీల‌క నిర్ణ‌యాలు క్యాబినెట్ తీసుకున్న‌ది.

రాష్ట్రంలో క‌రోనా విస్త‌ర‌ణ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై మంత్రివ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది. కొవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌ను మంత్రి వ‌ర్గానికి  అధికారులు వివ‌రించారు. ఈబీసీ నేస్తానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.  జ‌న‌వ‌రి 25న ఈబీసీ నేస్తం ప‌థ‌కం ప్రారంభం కాబోతున్న‌ది. ఏడాదికి రూ.15వేలు చొప్పున మూడేళ్ల‌లో రూ.45వేలు ఇవ్వ‌నున్నారు. ఈబీసీల‌లో 45-60 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉన్న అర్హులు అయిన మ‌హిళ‌ల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తింప‌జేయ‌నున్నారు. మొత్తం 3,92,674 మంది మ‌హిళ‌ల‌కు ల‌బ్ది చేకూర‌నుండ‌గా.. దీని కోసం రూ.589.01 కోట్లు వెచ్చించ‌నున్న‌ది ప్ర‌భుత్వం.

16 కొత్త మెడిక‌ల్ కళాశాల నిర్మాణానికి రూ.7880 కోట్ల‌కు ప‌రిపాల‌న ప‌ర‌మైన అనుమ‌తుల‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3,820 కోట్ల‌తో పాత మెడిక‌ల్ క‌ళాశాలు, అనుబంధ ఆసుప‌త్రులు పున‌రుద్ధ‌ర‌న, అభివృద్ధి ప‌నుల‌కు ప‌రిపాల‌న‌ప‌ర‌మైన అనుమ‌తుల‌కు క్యాబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62  ఏండ్ల‌కు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదించింది.

ముఖ్యంగా 11వ పీఆర్సీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్రను వేసింది.  కొవిడ్ విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన ప్ర‌భుత్వ ఉద్యోగుల కుటుంబాల‌లోని వారికి ఉద్యోగాల కోసం కారుణ్య నియ‌మాకాల‌కు ఆమోదం తెలిపింది.  వారికి గ్రామ, వార్డు సచివాలయాలలో ఉద్యోగాలు ఇవ్వ‌నున్నారు.. జూన్‌ 30 లోగా నియామకాలు కూడా చేపట్టాలని నిర్ణ‌యించారు.
జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్‌షిప్‌లో 10 శాతం స్థ‌లాలు, ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్తుల‌కు రిజ‌ర్వ్ పెన్ష‌నర్ల‌కు 5 శాతం స్థ‌లాలు రిజ‌ర్వ్‌, ప్ర‌తి అంసెబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్‌షిప్‌.. 20 శాతం రిబేటుతో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స్థ‌లాల‌కు క్యాబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ది.

ఎన్ఎంసీ నిబంధ‌న‌ల మేర‌కు 8 ఆడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యూకేష‌న్ పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదించింది. ఆయుష్‌ విభాగంలో నేచురోపతి, యోగా డిస్పెన్సరీల్లో 78 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం,  26 డిస్పెన్సరీల్లో ముగ్గురు చొప్పున 78 పోస్టులు భ‌ర్తీచేయ‌నున్న‌ది.
మున్సిపాలిటీగా  మారిన  వైఎస్సార్  తాడిగడపలో పంచాయతీగా ఉన్నప్పుడు ఉన్న 59 పోస్టులను మున్సిపాల్టీలో బదిలీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

కర్నూలు జిల్లా డోన్‌లో బాలికల బీసీ గురుకుల పాఠశాల మరియు జూనియర్‌ కాలేజీ, బేతంచర్లలో బాలుర గురుకుల పాఠశాలలకు 58 పోస్టుల మంజూరుకు కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.


కృష్ణపట్నం పవర్‌ ప్లాంట్‌ ఆపరేషనల్‌ మెయింటైనెన్స్‌ బాధ్యతలను మ‌రొకరికి అప్పగించేందుకు అవసరమైన బిడ్డింగ్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 25  ఏండ్ల  పాటు ఓ అండ్‌ ఏం (ఆపరేషనల్‌ అండ్‌ మెయింటైనెన్స్‌) కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.  అందులో పనిచేసే జెన్‌కో ఉద్యోగులను తిరిగి జెన్‌కోలోకి వచ్చేందుకు వెసులుబాటు  క‌ల్పించారు. వరుస నష్టాలు చవిచూస్తున్న కృష్టపట్నం థర్మల్‌ ప్లాంట్‌ కిలోవాట్‌ కోసం అవుతున్న ఖర్చు రూ.3.14.. దాని పక్కనే ఉన్న మరొక‌ పవర్‌ ప్లాంట్‌లో కి లోవాట్‌ ఉత్పత్తికి అవుతున్న ఖర్చు రూ.2.34, ఈ త‌రుణంలో ఆపరేషనల్‌ ఖర్చులు తగ్గించుకునేందుకు నిర్వహణ హక్కులు వేరొకరికి అప్పగించడానికి ఓ అండ్‌ ఎం కోసం బిడ్డింగ్‌కు ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్న‌ది క్యాబినెట్‌.


జ‌న‌వ‌రి 01,2022 నుంచి పింఛ‌న్‌ను రూ.2250 నుంచి రూ.2500 పెంచిన నిర్ణ‌యానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఏపీఐఐసీ నోడల్‌ ఏజెన్సీగా ఆటోనగర్ ల‌లో ఉన్న భూములను బహుళ అవసరాలకు వినియోగించేకుందుకు అవసరమైన గ్రోత్‌ పాలసీకి క్యాబినెట్‌ ఆమోదం ల‌భించింది.


ధాన్యం కొనుగోళ్ల  కోసం ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ రూ.5వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు కేబినెట్‌ అనుమతి.. రైతుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూసేందుకు  నిర్ణ‌యం తీసుఉకంది. సీజన్‌లో 50 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యం పెట్టుకుంది.  ఇప్పటివరకు 21.83 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ, 21 రోజుల్లో రైతులకు రూ.2150 కోట్ల చెల్లింపులు కూడా జ‌రిగాయి.


విశాఖ జిల్లా ఎండాడలో రాజీవ్‌ గృహ కల్ప ప్రాజెక్ట్‌లో నిరుపయోగంగా ఉన్న భూములను హెచ్‌ఐజీ, ఎంఐజీ కాలనీలకోసం వాడుకునేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదేవిధంగా  తిరుపతిలో స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌కు 5 ఎకరాల స్థలం.. అకాడమీ పెట్టేందుకు స్థలం ఇస్తూ కేబినెట్‌ నిర్ణయం.

ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీ పరిధిలో అనకాపల్లిలో రీజనల్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ స్టేషన్ కు  ఉచితంగా భూమి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్‌ ఆమోదం, రీజనల్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(రార్స్‌)కు 50 ఎకరాల భూమిని కేటాయించేందుకు  క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఎండోమెంట్ చ‌ట్టం -1987 కి సవ‌ర‌ణ‌ల‌తో ఆర్డినెట్స్ జారీ క్యాబినెట్ ఆమోదం, దీని ద్వారా టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియమానికి సంబంధించి స‌వ‌ర‌ణ‌లు తీసుకురావాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యం. ఓటీఎస్ ఇళ్లు, టిడ్కో విశాఖ‌లోని మిష‌న‌రీస్ ఆఫ్ చారిటీస్‌కు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఛార్జీ మిన‌హాయింపుల‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఓటీఎస్‌ ఇళ్లు, టిడ్కో, విశాఖలోని మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీస్‌కి స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీ మినహాయింపులకు కూడా క్యాబినెట్‌ ఆమోదం. ఐసీడీఎస్‌కు బాలమృతం, ఫోర్టిఫైడ్‌ ఆహారం, తాజా పాలు అమూల్‌ నుంచి సరఫరాకు క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.  ఏపీడీడీసీఎఫ్‌ ద్వారా  అమూల్ సరఫరా చేయనున్నది. మీట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో 7 పోస్టుల మంజూరుకు క్యాబినెట్‌ ఆమోదం .
 
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో 13 పోస్టులు మంజూరుకు ఆమోదం. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో స్వల్ప మార్పులు చేసిన ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రెండు వాయిదాల్లో ఓటీఎస్‌ కట్టే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం, ఉగాది, దీపావళి రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటుకు కేబినెట్‌ ఆమోదం.ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్రంలో తాజా వ్యవసాయ పరిస్థితులపై మంత్రి వర్గసమావేశంలో చర్చ కొన‌సాగుతుంది.

 వ్యవసాయ అనుబంధ రంగాల్లో గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌ లో ప్రథ‌మ స్ధానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్‌. వ్యవసాయరంగంలో 11.3 శాతం, ఉద్యానవన రంగంలో 12.3 శాతం, పశుసంవర్ధకశాఖలో 11.7 శాతం, మాంసం ఉత్పత్తిలో 10.3 శాతం అభివృద్ధి సాధించింది ఏపీ.  దీంతో పాటు క్రాప్‌ ఇన్సూరెన్స్‌లో అనుసరించిన వినూత్న విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మిగిలిన రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిచిందని క్యాబినెట్‌లో  అధికారులు వివ‌రించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: