అంతే కాకుండా ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా తక్కువ గానే ఉంటుంది, అది కూడా రెండు డోసులు టీకా తీసుకోని వారు.. మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ, గుండె జబ్బులు వంటి దీర్ఘ కాలిక సమస్యలతో బాధపడే వారు ఎక్కువగా ఆసుపత్రి పాలవుతున్నారు. కానీ త్వరగానే కోలుకుంటున్నట్లు సమాచారం. కాబట్టి ఒమిక్రాన్ వస్తే ఆందోళన పడకండి అని అంటున్నారు వైద్యులు. ప్రతి రోజూ మీకు ఇచ్చిన మందులను వాడుతూ, తగిన ఆహార నియమాలు పాటించండి. అలాగే టెన్షన్ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే త్వరగానే దీని బారి నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు.
ఎంత ప్రమాదమైన వ్యాధి లేదా వైరస్ అయినా వచ్చిన తర్వాత ఇబ్బంది పాడడం కన్నా, అది రాకుండా ముందు గానే జాగ్రత్త తీసుకోవడం మంచిది. దానికి మించిన మందు లేదు, వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటూ నియమాలు పాటించండి. మీ పిల్లల్ని సైతం కరోనా నియమాలు పాటించేలా చూసుకోండి. ఇంకా రెండు నెలలు అంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.