రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చినా దళిత బంధు పథకం యధాతథంగా అమలవుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందులో ఏ అనుమానాలు, సందేహాలు అవసరం లేదని చెప్పారు. నూటికి నూరుశాతం దళిత బంధు స్కీం  అమలవుతుందని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరి మాటలు నమ్మద్దని దళిత జాతిని ఆయన కోరారు. దళిత బందు లబ్ధిదారులైన దళితులకు 10 లక్షల రూపాయల చొప్పున ఇచ్చే కీలకమైన పథకం. దీనిని ఎప్పుడు అమలు చేస్తారు,ఎలా అమలు చేస్తారు అనే సందేహాలు,అనుమానాలు అన్ని వర్గాల్లో ఉన్నాయి.

ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ కెసిఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఇప్పటికే హుజూరరాబాద్ లో ఇది అమలువుతోంది. దీంతో మిగిలిన 118 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ పథకాన్ని అమలు చేస్తారు. రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకం అమలు చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈ పథకం అమలుపై కరీంనగర్ నుంచి ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. బీఆర్ కే భవన్ నుంచి సీఎస్ సోమేష్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కుటుంబాన్ని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. మార్చి నెల లోపు వంద కుటుంబాలకు దళిత బందు పంపిణీ చేయాలని మంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం కెసిఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పైలెట్ పద్ధతిన పూర్తిస్థాయిలో పథకాన్ని అమలు చేస్తున్నారు. మరో నాలుగు మండలాల్లోనూ పైలెట్ పద్ధతిన ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాలు ఇందులో ఉన్నాయి. హుజురాబాద్ లో పూర్తిస్థాయిలో దళితబంధు  అమలవుతున్న తరుణంలో రాష్ట్రంలోని మిగతా 118 నియోజకవర్గాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 100 మంది లబ్ధిదారుల చొప్పున ఈ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించారు. ఆ పథకాన్ని వేగవంతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆ పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రవేశం నిర్వహించారు.

 ఇందుకోసం స్థానిక శాసనసభ్యుల సలహాలతో లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లా ఇన్చార్జి మంత్రులతో ఆమోదించుకోవాలని తెలిపారు. ప్రతి లబ్దిదారునికి బ్యాంకు లింకేజీ లేకుండా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో కోరుకున్న యూనిట్ నే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి మంజూరైన పది లక్షల నుంచి 10 వేల రూపాయలతో ప్రత్యేకంగా దళిత బంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.  118 నియోజకవర్గాల్లో పథకం అమలు కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 వందల కోట్ల రూపాయలు కేటాయించి అందులో ఇప్పటికే వంద కోట్లు విడుదల చేశారు. మిగతా మొత్తాన్ని విడతల వారీగా  విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: