కేంద్రంతో.. జగన్‌ సర్కార్‌ కీలక చర్చలు ?
కేంద్ర ఆర్ధికశాఖ కార్యదర్శి, పలు ఇతర కేంద్ర శాఖల కార్యదర్శులతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సి.ఎస్ తో సహా, పలువురు ఉన్నతాధికారులు సమావేశం జరుగనుంది.  వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి నేతృత్వంలో ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం జరుగనుంది. ప్రతినిధి బృందంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సహా ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.   రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవలే ప్రధానిని కలిశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.   సమస్యల పరిష్కారానికి వివిధ కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసిన ప్రధాని...   రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్ధిక తోడ్పాటు ను పొందే లక్ష్యంగా రాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశం జరుగనుంది.  

ఆంధ్ర ప్రదేశ్‌  రాష్ట్ర విభజన సమయం లో కేంద్రం ఇచ్చిన హామీలపై కేంద్రం తో చర్చిం చేందుకు ఢిల్లీ వచ్చింది ఆంధ్ర ప్రదేశ్‌  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలో రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల బృందం. రాష్ట్ర ఆర్ధిక లోటు భర్తీ, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్, పోలవరం సాగు నీటి ప్రాజెక్టు కు నిధులు తదితర అంశాలపై కేంద్రం తో చర్చ జరుగనుంది. సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో చర్చలు జరపనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌  ప్రభుత్వ ప్రతి నిధుల బృందం. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరనున్న రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం.... రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు మంజూరు చేయాలని డిమాండ్‌ చేయనున్నారు. విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన సంస్థలన్నింటికీ నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేయనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రా ష్ట్ర సి.ఎస్ తో సహా, పలువురు ఉన్నతా ధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: