అమరావతి : చంద్రబాబుని కలిసిన టీడీపీ నిజ నిర్దారణ కమిటీ సభ్యులు... గుడివాడ కేసినో పై చంద్రబాబుకి  నివేదిక అందజేసింది. ఈ సందర్ఢంగా మంత్రి కొడాలి నాని పై సంచలన వ్యాఖ్యలు చేశారు  టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.  గుడివాడలో కేసినో నిర్వహణపై రూపొందించి సమగ్ర నివేదికను  గవర్నరుకి అంద చేస్తామని పేర్కొన్నారు వర్ల రామయ్య, గవర్నర్ రేపు, ఎల్లుండిలో సమయమిస్తే ఆయనకు క్యాసినో నిర్వహణపై అన్ని సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు వర్ల రామయ్య, క్యాసినో జరిగింది వాస్తవం, పోలీసులు దర్యాప్తు చేసేందుకు ఎందుకో విముఖంగా ఉన్నారు... కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు వర్ల రామయ్య

ఈడీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇన్కమ్ టాక్స్ శాఖలు సమగ్ర దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు వర్ల రామయ్య, కొడాలి నానికి బేడీలు తప్పవని హెచ్చరించారు వర్ల రామయ్య, నిజాల్ని కప్పిపుచ్చేందుకే కొడాలి నాని బూతులతో విరుచుకుపడుతున్నారన్నారు వర్ల రామయ్య, జగన్ ఆత్మలతో మాట్లాడినట్లు, కొడాలి నాని ఆయన తండ్రి ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేయాలని చురకలు అంటించారు వర్ల రామయ్య, వర్ల రామయ్యతో ఎందుకు పెట్టుకున్నావ్ అని కొడాలినాని తండ్రి ఆత్మ ఖచ్చితంగా హెచ్చరిస్తుందని ఫైర్‌ అయ్యారు వర్ల రామయ్య, వర్ల రామయ్య పోలీసు అధికారిగా  కొడాలినాని ని ఎన్నిసార్లు కొట్టారు, ఏఏ కేసులు పెట్టానో నేను ఇప్పుడు చెప్పనని వెల్లడించారు.  మహిళల్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసిన సిగ్గులేని మంత్రి కొడాలి నాని అని..  అంశాన్ని ఇంతటితో వదలం, జాతీయ స్థాయిలో పోరాడతామని స్పష్టం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర.  రాష్ట్రం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని.. రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రంలో పాలన ఉందని చెప్పా రు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర.

మరింత సమాచారం తెలుసుకోండి: