మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఘటనపై స్పందించారు. టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులకు పాల్పడిన కారణంగానే అమాయకురాలైన బాలిక మనోవేదనతో ఉసురుతీసుకుందని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. ఆదివారం ఆయన బాలిక కుటుంబ సభ్యులను బంధువులను పరామర్శించి ఘటన వివరాలను తెలుసుకుని వారిని ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే సీఎం జగన్మోహన్రెడ్డి సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారని, ఆ పాపకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని కూడా మంత్రి చెప్పారు. ఈ ఘటనలో నిందితుడైన వినోద్జైన్ విజయవాడ ఎంపీ టీడీపీ నేత కేశినేని నాని ముఖ్య అనుచరుడని, కార్పొరేషన్ ఎన్నికల సమయంలో అతడి తరపున ఎంపీ కేశినేని నాని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేశారని, అటువంటి వ్యక్తులను పార్టీలో ఉంచుకున్నందుకు ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని మంత్రి వెల్లంపల్లి నిలదీశారు. మొత్తంమీద రాజకీయ దుమారంగా మారిన ఈ ఘటన టీడీపీని ఆత్మరక్షణలో పడేలా చేసిందనే చెప్పాలి. దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఘటనపై స్పందించారు. టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులకు పాల్పడిన కారణంగానే అమాయకురాలైన బాలిక మనోవేదనతో ఉసురుతీసుకుందని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. ఆదివారం ఆయన బాలిక కుటుంబ సభ్యులను బంధువులను పరామర్శించి ఘటన వివరాలను తెలుసుకుని వారిని ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే సీఎం జగన్మోహన్రెడ్డి సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారని, ఆ పాపకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని కూడా మంత్రి చెప్పారు. ఈ ఘటనలో నిందితుడైన వినోద్జైన్ విజయవాడ ఎంపీ టీడీపీ నేత కేశినేని నాని ముఖ్య అనుచరుడని, కార్పొరేషన్ ఎన్నికల సమయంలో అతడి తరపున ఎంపీ కేశినేని నాని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేశారని, అటువంటి వ్యక్తులను పార్టీలో ఉంచుకున్నందుకు ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని మంత్రి వెల్లంపల్లి నిలదీశారు. మొత్తంమీద రాజకీయ దుమారంగా మారిన ఈ ఘటన టీడీపీని ఆత్మరక్షణలో పడేలా చేసిందనే చెప్పాలి. దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.