దీంతో వీరిద్దరి పేర్లు ఒకేమాదిరిగా ఉండటంతో లొంగిపోయిన వ్యక్తి కమాండరేనా లేక మరొకరా అనే విషయంపై అయోమయం నెలకొంది. మావోయిస్టు మిలీషియస్ కమాండర్ హిడ్మా నేతృత్వంలో గత సంవత్సరం ఛత్తీస్ఘడ్లోని తెర్రం అటవీ ప్రాంతంలో తీవ్రవాదులు రక్షక దళాలపై దాడి జరిపి 25 మంది జవాన్లను హతమార్చడంతో ఇతడి పేరు దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. బస్తార్ దక్షిణ ప్రాంతం, బీజపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో జరిగిన పలు తీవ్రవాద ఘటనల్లో హిడ్మా కీలక పాత్ర వహించినట్టుగా పోలీసు వర్గాలు చెపుతున్నాయి. ఇతడి ఆచూకీ తెలిపినవారికి రూ. 25 లక్షల రివార్డును ఛత్తీస్ఘడ్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కాగా హిడ్మాపై లొంగిపోయిన విషయంపై జరుగుతున్న ప్రచారం పోలీసుల వ్యూహంలో భాగమా లేక నిజంగానే మావోయిస్టులు ఆత్మరక్షణలో పడి చేస్తున్న వ్యాఖ్యలా అన్నది తేలాల్సి ఉంది.
దీంతో వీరిద్దరి పేర్లు ఒకేమాదిరిగా ఉండటంతో లొంగిపోయిన వ్యక్తి కమాండరేనా లేక మరొకరా అనే విషయంపై అయోమయం నెలకొంది. మావోయిస్టు మిలీషియస్ కమాండర్ హిడ్మా నేతృత్వంలో గత సంవత్సరం ఛత్తీస్ఘడ్లోని తెర్రం అటవీ ప్రాంతంలో తీవ్రవాదులు రక్షక దళాలపై దాడి జరిపి 25 మంది జవాన్లను హతమార్చడంతో ఇతడి పేరు దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. బస్తార్ దక్షిణ ప్రాంతం, బీజపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో జరిగిన పలు తీవ్రవాద ఘటనల్లో హిడ్మా కీలక పాత్ర వహించినట్టుగా పోలీసు వర్గాలు చెపుతున్నాయి. ఇతడి ఆచూకీ తెలిపినవారికి రూ. 25 లక్షల రివార్డును ఛత్తీస్ఘడ్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కాగా హిడ్మాపై లొంగిపోయిన విషయంపై జరుగుతున్న ప్రచారం పోలీసుల వ్యూహంలో భాగమా లేక నిజంగానే మావోయిస్టులు ఆత్మరక్షణలో పడి చేస్తున్న వ్యాఖ్యలా అన్నది తేలాల్సి ఉంది.