సమస్యలన్నింటికీ చంద్రబాబే కారణం అని ఆరోపించారు నానీ.ఇండస్ట్రీ సమస్యలకు ఆయనే కారణం అని చెప్పి వెళ్లారు నాని.వెళ్తూ వెళ్తూ కొన్ని మాటలు చెప్పి వెళ్లారు.అవన్నీ వింటే జ్ఞానోదయం దక్కక మానదు.ఆ విధంగా ఆయన భీమ్లా నాయక్ సినిమాకు ఎంత సాయం చేశారో ఏ విధంగా ఆసినిమాకు అండగా నిలిచారో చెప్పి మరోసారి అందరినీ విస్మయానికి గురిచేశారు.
వైసీపీ వర్గాలు అన్నీ ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమానే టార్గెట్ చేస్తున్నాయి.తాము ఆ సినిమాకు ఎంతగానో సహకరించామని,అభిమానులే మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని కొడాలి నాని చెప్పుకుంటూ వస్తున్నారు.ఆయన మాటలు అయితే ఎప్పటిలానే హాయిగానే ఉన్నాయి.ఉంటాయి కూడా! చంద్రబాబును తిట్టినా, పవన్ ను తిట్టినా అవన్నీ జ్ఞానాన్ని ప్రబోధిస్తూనే ఉంటాయి కనుక వాటితో ఎటువంటి విభేదం విన్నవాళ్లకు ఉండదు.ఉండకూడదు.ఇదే తరుణంలో చిరు పేరును ప్రస్తావిస్తూ గతంలో జరిగిన విషయాలనూ ప్రస్తావిస్తూ ఎప్పటిలానే జగన్ సర్ ను పొగిడి చంద్రబాబును తిట్టి, పవన్ ను టార్గెట్ చేసి ప్రెస్మీట్ ను ముగించి ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లిపోయారు.ఇదేవిధంగా ఆయన తిడుతూ ఉంటే అయ్యో! అవి తిట్లు కావు అని జగన్,.అయ్యో అవి సుభాషితాలు అని సజ్జల అంటుంటే విని ఊగిపోవడం మన వంతు కావొచ్చు. ఇంతకూ అసలు ఇవాళ ఏమయిందంటే...
మంత్రి కొడాలి నాని మళ్లీ రెచ్చిపోయారు.మామూలుగా కాదు ఓ రేంజ్ లో! ఈ సారి పవన్ ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.తామేం భీమ్లా నాయక్ ను తొక్కేయలేదు అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు.మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ మధ్య మధ్యలో గతంలో జరిగిన విషయాలనూ ప్రస్తావించారు.తాము ఏమయినా ఫిబ్రవరి 25న సవరించిన టికెట్ ధరలకు సంబంధించి జీఓ ఇస్తామని చెప్పామా...? మా మంత్రి మరణంతో నాలుగు రోజులు ఆలస్యం అయినంత మాత్రాన మమ్మల్ని అదే పనిగా నిందిస్తారా? న్యాయ పరమయిన అడ్డంకులు లేకుండా ఉండేందుకే జీఓ కాపీ విడుదలలో కాస్త ఆలస్యం అయిందని అన్నారు.