ఇటీవలి కాలంలో భారత రైల్వే ప్రయాణికులు అందరికీ ఎప్పుడు మెరుగైన.. ఎంతో సౌకర్యమైన ప్రయాణాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ప్రయాణికులకు ఇబ్బంది గురి చేసే విధంగా ఏదైనా అంశం తెర మీదికి వస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు. ఇకపోతే ఇటీవల రైలు ప్రయాణికులకు ఆహారం అందించేందుకు భారత రైల్వే పలు సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చింది. కాంట్రాక్టు ఇచ్చి ఊరుకోకుండా ప్రయాణికులకు మెరుగైన సర్వీసులు  అందుతున్నాయా లేదా అని అనుక్షణం నిఘా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.


 ఇకపోతే ఇటీవల ఊహించని ఘటన చోటుచేసుకుంది. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత టీ ఇవ్వలేదు అన్న కారణంతో ఏకంగా కాంట్రాక్టు సంస్థకు ఐఆర్సిటిసి లక్ష రూపాయలు జరిమానా విధించడం సంచలనంగా మారిపోయింది. రైళ్లల్లో అందుతున్న సేవలు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వాటిని పరిష్కరించేందుకు ప్యాసింజర్ సర్వీస్ కమిటీ తనిఖీలు చేపడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ఆ టీం జనశతాబ్ది ఎక్ష్ప్రెస్ లో ప్రయాణించింది. ఢిల్లీ నుంచి అమృత్సర్ వరకు ఈ టీమ్ లోని సభ్యులను రైల్లో ప్రయాణం చేశారు అని చెప్పాలి.


 ఈ క్రమం లోనే రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి సేవలు అందుతున్నాయి అన్న విషయాలను గమనించారు. ఈ క్రమం లోనే కాంట్రాక్టర్లు మంచి ఫుడ్ అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు రైల్లోని ప్రయాణికులందరిని ప్రశ్నించారు. ఈ క్రమం లోనే బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ ఇవ్వడం లేదని అధికారులు గుర్తించారు. ఇక ఈ విషయం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు కాంట్రాక్టు సంస్థకు లక్ష రూపాయల జరిమానా విధించడం గమనార్హం. అంతే కాకుండా రైలు బోగీలో కూడా అపరిశుభ్రత ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా విధించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: