బ్యాంకు అకౌంట్లో నిర్దిష్ట పరిమితికి మించి డబ్బు జమ చేయడం లేదా విత్‌డ్రా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకొచ్చింది.ఇక ఇది మే 26 వ తేదీ నుండి అమలులోకి వస్తుంది. దీంతోపాటు బ్యాంక్ లేదా పోస్టాఫీసులో కరెంట్ అకౌంట్ ని తెరవడానికి ఈ నిబంధన కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ రెండింటికి ప్రభుత్వం ఆధార్ కార్డ్ లేదా పాన్‌ కార్డ్ ని తప్పనిసరి చేసింది.సేవింగ్స్ అకౌంట్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, క్యాష్ విత్‌డ్రాయల్ ఛార్జీల ఇంకా అలాగే క్యాష్ డిపాజిట్ ఛార్జీలు అనేవి ఇకపై రూ. 20 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి లేదా విత్‌డ్రా చేయడానికి ఈ రూల్ అనేది వర్తిస్తుంది. మే 10 వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా CBDT ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఇక అంతేకాదు ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో కరెంట్ ఖాతా లేదా నగదు క్రెడిట్ ఖాతాను తెరవడం అనేది కూడా అవసరం. దీంతో ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుందని కూడా నిపుణులు భావిస్తున్నారు.ఇక నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తికి పాన్ కార్డ్ సమాచారం అందించాల్సిన అవసరం ఉండి అతని వద్ద పాన్ కనుక లేకపోతే..ఆ సంబంధిత వ్యక్తి ఆధార్ బయోమెట్రిక్ గుర్తింపును ఇవ్వడం ద్వారా కూడా పని చేయవచ్చు.



ఇక లావాదేవీ సమయంలో పాన్ నంబర్ ఇస్తే, పన్ను అధికారులకు లావాదేవీలను ట్రాక్ చేయడం కూడా చాలా సులభం అవుతుందని నంగియా అండ్ కోకు చెందిన శైలేష్ కుమార్ తెలిపారు.అలాగే CBDT(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) కొత్త రూల్స్ ఇన్‌కమ్ ట్యాక్స్(15వ సవరణ) రూల్స్, 2022. ఈ చర్య ఆర్థిక లావాదేవీలలో మరింత పారదర్శకతను కూడా తీసుకువస్తుందని.. ఇక దీని కారణంగా బ్యాంకులు ఇంకా అలాగే పోస్టాఫీసులు లేదా సహకార సంస్థలు మరిన్ని లావాదేవీలను నివేదించడం తప్పనిసరి అని AKM గ్లోబల్ సందీప్ సెహగల్ ఆశాభావంని వ్యక్తం చేశారు.ఇక ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలపై ప్రభుత్వం చెక్ పెట్టేందుకు ఇది చాలా దోహదపడుతుందని ఆయన అన్నారు. ఇది అనుమానాస్పద డిపాజిట్లు ఇంకా విత్ డ్రా లకు సంబంధించిన ప్రక్రియలో కఠినతను తీసుకువస్తుందని అన్నారు. ఇప్పటి దాకా ఆదాయపు పన్ను సంబంధిత పనుల కోసం ఆధార్ కార్డ్ లేదా పాన్‌ కార్డ్ ను ఉపయోగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: