ఇక ఈ సారి రాయలసీమలో మంచి విజయాలని సాధించాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సరికొత్త స్ట్రాటజీలతో ముందుకొస్తున్నారు…రాయల సీమలో బలం పెంచడం కోసం కష్టపడుతూనే ఉన్నారు..ఎప్పుడు ఏదొరకంగా రాయల సీమ జిల్లాల్లో పర్యటిస్తూ…ఆ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తున్నారు. అలాగే రెడ్డి సామాజికవర్గాన్ని కూడా టీడీపీ వైపుకు తిప్పుకునేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే పలువురు రెడ్డి నేతలని కూడా పార్టీలోకి తీసుకొచ్చారు..అయితే మరికొంతమందిని కూడా టీడీపీలోకి తీసుకోచ్చేందుకు చూస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.అయితే ఇప్పటికే యువతలో మంచి క్రేజ్ ఇంకా ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి….టీడీపీలోకి వస్తున్నారంటూ ఆ మధ్య బాగా ప్రచారం అనేది జరిగింది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజముందో ఇంకా క్లారిటీ లేదు. ఇక సిద్ధార్థ్ విషయం పక్కన పెడితే…సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా టీడీపీలోకి రాబోతున్నారని ప్రచారం మొదలైంది..రాజశేఖర్ సోదరుడు కుమారుడే సిద్ధార్థ్ అనే సంగతి అందరికీ తెలిసిందే..అయితే ఇప్పుడు ఇద్దరు కూడా రాజకీయంగా వేరు వేరు పార్టీల్లో ఉన్నారు.


ఇక సిద్ధార్థ్ వైసీపీలో ఉండగా ఇంకా రాజశేఖర్ బీజేపీలో ఉన్నారు…అయితే గతంలో రాజశేఖర్ టీడీపీలో పనిచేసిన సంగతి తెలిసిందే…తర్వాత టీడీపీ నుంచి బయటకొచ్చి రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట రాజకీయంని కూడా ఆయన నడిపారు…తర్వాత కాంగ్రెస్ ఇంకా మళ్ళీ 2019 ఎన్నికల ముందు టీడీపీకి దగ్గరయ్యారు..ఆ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు..ఇక మళ్ళీ ఇప్పుడు ఆయన టీడీపీలోకి వస్తారని ప్రచారం కూడా మొదలైంది…అలాగే ఆయనకు శ్రీశైలం సీటు కూడా ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం వస్తుంది. కర్నూలు జిల్లాలో మంచి బలమైన నాయకుడుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి…ఇక టీడీపీలోకి వస్తే కాస్త అడ్వాంటేజ్ ఉంటుందనే విషయం చెప్పాలి..మరి చూడాలి తెలుగు దేశం పార్టీలోకి బైరెడ్డి ఎంట్రీ కన్ఫామా? బైరెడ్డి కుటుంబం టీడీపీలోకి ఎంట్రీ ఇస్తుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: