రాజధాని విషయం లో బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించినట్లే. ఓట్ల చీలిక విషయంలోనూ బీజేపీ హైకమాండ్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. కాపులు మద్దతు వైసీపికి వుంటుందని ఆ పార్టీ నాయకులు విర్రవీగుతూ , ధీమాను వ్యక్తం చెస్తున్నారు.. కాపు సామాజిక వర్గం ఓటర్లు తమను రాజకీయంగా ఏం చేయలేరనే భావన లో వైసీపీ వుందని ఆయన ఎద్దేవా చేశారు. కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ చాలా తేలిగ్గా తీసుకుంది. వైసిపి ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ చేతులు ఎత్తెసారని పవన్ కళ్యాణ్ చురకలు అంటించారు.
ఇప్పటికే అప్పు పుట్టని పరిస్ధితి లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని పవన్ మండిపడ్డారు. ఏపీ ఆర్ధిక పరిస్ధితి పై కేంద్రానికి పూర్తి అవగాహన వుందన్నారు. తెలంగాణ లో 30 స్థానాల్లో పోటీ చేసే బలం జనసేనకు వుందని పవన్ తెలిపారు. తెలంగాణ లో 15 స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఎక్కడ పోటీ చేసినా తనను ఓడిస్తామన్న వైసీపీ నేతల ఛాలెంజ్ను స్వీకరిస్తున్నానని పవన్ తెలిపారు. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయని, తనను విమర్శించిన మాజీ మంత్రులకు ఇప్పటికైనా తెలిసుండాలని ఆయన చురకలు వేశారు. వైసిపి ప్రభుత్వం ఆటలు ఇంకా సాగవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.