అహ్మదాబాద్‌లోని సైన్స్‌ సిటీ రోడ్డులో ఉన్న మెక్‌డోనాల్డ్స్‌ కస్టమర్‌ కూల్‌డ్రింక్‌లో బల్లి కనిపించడంతో చాలా భయాందోళనలు సృష్టించారు. కూల్‌డ్రింక్‌ తాగిన బాధితుడు వెంటనే ఈ విషయాన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సమాచారం అందించాడు.ఇక అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మెక్‌డోనాల్డ్స్ ని సీల్‌ చేసింది.ఇక దీని పూర్తి వివరాలు పరిశీలించగా...ఇద్దరు స్నేహితులు  కలిసి మెక్‌డోనాల్డ్స్‌ లో కూల్‌డ్రింక్‌ తాగుతున్నారు. ఈ క్రమంలోనే కూల్‌డ్రింక్‌లో చనిపోయిన బల్లి బయటకు రావడం పెద్ద కలకలం రేపింది. యువకులిద్దరూ కూడా జరిగిన విషయాన్ని మొత్తం స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌కు తెలిపారు.ఇక సమచారం అందుకున్న మున్సిపల్‌ అధికారులు ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు కూల్‌ డ్రింక్‌ నమూనాలను సేకరించి చెకింగ్ కోసం పబ్లిక్‌ హెల్త్‌ లేబొరేటరికి పంపారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న మెక్‌డోనాల్డ్స్‌ కు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది.



అలాగే భార్గవ జోషి అనే కస్టమర్ మెక్‌డొనాల్డ్స్ అందించిన కూల్‌డ్రింక్‌లో చనిపోయిన బల్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో AMC అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇక తదుపరి చర్యలు తీసుకునే వరకు కూడా రెస్టారెంట్‌ను మూసివేయాలని కూడా వారు ఆదేశించారు. అలాగే మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతి లేకుండా కూడా మళ్లీ ప్రారంభించరాదని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే సమయంలో జరిగిన ఘటనపై మెక్‌డొనాల్డ్స్ కీలక ప్రకటన కూడా చేసింది.ఇక మెక్‌డొనాల్డ్స్ తన ప్రకటనలో ఇలా కూడా పేర్కొంది. మేము మా కస్టమర్ల భద్రత ఇంకా అలాగే పరిశుభ్రత పట్ల కూడా పూర్తి శ్రద్ధ వహిస్తాము. అహ్మదా బాద్ అవుట్‌లెట్‌లో జరిగిన ఈ సంఘటనపై మేము దర్యాప్తుని చేస్తున్నాము. అయితే ఇక ఇలాంటి పొరపాటు ఎలా జరిగిందనే దానిపై కూడా బాధ్యతగల పౌరులుగా అధికారుల విచారణకు మా వంతు పూర్తి సహకారం అందిస్తామని వారు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: