ఇక ప్రస్తుతం కొంత మంది పెళ్లి బంధానికి ఉన్న గొప్పతనాన్ని బాగా దిగజారుస్తున్నారు. పెళ్లైన తర్వాత కూడా పలు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తు సభ్యసమాజం ముందు తలదించుకునే విధంగా వారు ప్రవర్తిస్తున్నారు.ఇక వీరి ప్రవర్తన కారణంగా కుటుంబాలలో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే పచ్చని కాపురాలు కాస్త రోడ్డున పడుతున్నాయి. కుటుంబాలు కూడా బాగా విచ్ఛిన్నమవుతున్నాయి. పిల్లలు సమాజంలో చాలా చిన్నచూపుకు గురౌతున్నారు. ఇలాంటి ఘటనలలో కొన్ని సార్లు కూడా తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దీనిలో వీరు.. హత్యలు చేయడానికి కూడా అసలు వెనుకాడం లేదు. దీంతో నేరస్థులుగా కూడా మారిపోతున్నారు. ఇలాంటి ఉదంతాలు ప్రతి రోజు కూడా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఈ కోవకు చెందిన మరో ఘటన కూడా ప్రస్తుతం వార్తలలో నిలిచింది.పూర్తి వివరాలలోకి వెళితే రాజస్థాన్ లో ఈ దారుణమైన ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఒక వివాహిత చేసిన తప్పుకి రెండు ప్రాణాలు కోల్పోయాయి.ఇక బికనీర్ జిల్లాకు చెందిన ఒక మహిళ తన సొంత మేనల్లుడితో ఎఫైర్ పెట్టుకుంది. దీన్ని గుర్తించిన భర్త..తన పద్ధతి మార్చుకొవాలని ఎన్నో సార్లు భార్యకు సూచించాడు. ఇక అయినా కానీ తన భార్య పద్ధతిలో ఎలాంటి మార్పు రాలేదు.



దీంతో భర్త తట్టుకోలేక తీవ్ర మనస్తాపనికి గురయ్యాడు. తన భార్య ప్రియుడిని మాట్లాడుకుందామని పిలిచి, ఆపై మద్యం తాగించాడు. ఆ తర్వాత ఇక అతడిని హత్యచేశాడు. అయితే తన ప్రియుడిని భర్త ఆదివారం నాడు చంపేశాడనే విషయం వివాహితకు తెలిసింది.దీంతో ఆమె తన ఎడబాటును అసలు భరించలేకపోయింది. తన ప్రియుడు లేని లోకంలో ఆమె కూడా ఉండకూడదనుకుంది. వెంటనే అక్కడ శ్రీదున్‌గర్‌ఘర్ ప్రాంతంలో ఉన్న రైల్వేస్టేషన్ కు వెళ్లింది. అక్కడ వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆమె సూసైడ్ చేసుకుంది. దీంతో సోమవారం నాడు పోలీసులు రైల్వే ప్లాట్ ఫామ్ సమీపంలో మహిళ చనిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే కేసుని నమోదు చేశారు. వివాహేతర సంబంధం బయట పడటంతో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: