కానీ రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈమె బీజేపీ లోకి వెళ్ళడానికి ప్రణాళికలు రచిస్తోందట. ఇందుకు ముందుగా ఏపీ బీజేపీ పెద్దలతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారట. అంతా అనుకున్నట్లు జరిగితే సోమవారం లోగా బీజేపీలో చేరుతారని భోగట్టా. కాగా ఏమీ ఇంతకు ముందు వరకు టీడీపీ లో అధికార ప్రతినిధిగా ఉన్నారు. పార్టీలో ఉంటూ ఎదుటి పార్టీలపై ఒక రేంజ్ లో విరుచుకుపడే సామర్ధ్యం ఉంది ఈమెకు. వైసీపీలో ఎలా అయితే ఫైర్ బ్రాండ్ గా రోజా ఉందో, టీడీపీ లో దివ్యవాణి కూడా అదే స్థాయిలో పాపులర్ అయింది.
కాగా ఈమె టీడీపీ నుండి బీజేపీకి రావడం పట్ల ఏపీ బీజేపీ నాయకులు లేదా కార్యకర్తల నుండి ఏమైనా విముఖత ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక కొందరు అయితే ఇది చంద్రబాబు ఎన్నికల కోసం వేసే ప్రణాళికలో ఒక భాగమే అని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇలా చూస్తే ఇది ఎంత మేరకు టీడీపీ కి ఉపయోగం కానుంది అన్నది తెలియాల్సి ఉంది.