కేజీహెచ్ లో కరోనా వార్డ్..
కరోనా కేసులు పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా కేజీహెచ్ లో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. 350 బెడ్స్ సిద్ధం చేశారు. కొవిడ్ బారిన పడిన గర్భిణులు, పిల్లలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకోసం ఈ బెడ్స్ సిద్ధంగా ఉచారు. అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు. ఇతర మందులు కూడా అందుబాటులో ఉంచారు. అయితే ప్రస్తుతం కేజీహెచ్ లో కరోనా బాధితులెవరూ చికిత్స తీసుకోవడంలేదు. దాదాపుగా అందరూ హోమ్ ఐసోలేషన్లో ఉండేందుకే ఇష్టపడుతున్నారు.
ఈ సారి కరోనా మరీ స్వల్ప లక్షణాలతో వస్తున్నట్టు తెలుస్తోంది. స్వల్పంగా జ్వరం, దగ్గు, తుమ్ములు ఉన్నవారెవరైనా పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. ప్రస్తుతం జ్వరం, తలనొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులు ఉన్నవారు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ గా తేలుతుందని భయపడుతున్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే ప్రాణాపాయం ఉండదని, ప్రజలు భయపడొద్దని చెబుతున్నారు వైద్యులు. అధికారులు కూడా.. మాస్క్ నిబంధన కఠినతరం చేస్తామంటున్నారు. ప్రజలంతా మాస్క్ లు ధరించాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలంటున్నారు.