మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చిన అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ సెల్ఫీ ప్రపంచంలో మునిగిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ప్రతి ఒక్కరు కూడా ఇక మధురమైన క్షణాలను  సెల్ఫీలో బంధించడానికి ఇష్టపడుతున్నారు. ఇలా కొన్ని కొన్ని సార్లు తీసుకునే సెల్ఫీలు కాస్త విచిత్రంగా అనిపించినప్పటికీ చూడటానికి మాత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఫోటోలు అటు సోషల్ మీడియాలో ఎంతో ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి.



 ఇక ఇలాంటి ప్రత్యేకమైన ఫోటోలను ఎంతోమంది మధురమైన జ్ఞాపకాలు భద్రంగా దాచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక చాలా ఏళ్ళ తర్వాత అలాంటి ఫోటోలను మళ్లీ చూసి మురిసిపోతూ ఉంటారు. ఇప్పుడు  ఇలాంటి ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రెండు వేరు వేరు రైల్వే లో ఉన్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు తీసుకున్న సెల్ఫీ వైరల్ గా మారిపోయింది. ఇందులో కొత్తేముంది అని అనుకుంటున్నారు కదా.. ఇలా సెల్ఫీ తీసుకున్న ఇద్దరు కూడా తండ్రి కొడుకులు కావడం గమనార్హం. తండ్రి ఎప్పటినుంచో రైల్వే గార్డ్ గా పని చేస్తూ ఉన్నాడు.


 ఇక ఇటీవలే అతని కొడుకు ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ ఉద్యోగంలో చేరాడు. అయితే ఇద్దరు చేసేది రైల్వే ఉద్యోగం అయినప్పటికీ వీరి పదోన్నతులు మాత్రం వేరు కావడం గమనార్హం. ఇక ఒకరు ఉద్యోగం సమయంలో ఒక ప్రాంతానికి వెళ్తే మరొకరు మరో ప్రాంతానికి వెళ్తారు. ఇక వీరిద్దరూ రైల్వే లోనే పనిచేస్తూ ఉన్నప్పటికీ కలిసేది మాత్రం కేవలం ఇంట్లోనే అని చెప్పాలి. కానీ ఇటీవల ఒక రోజు విధుల్లో ఉన్న సమయంలోనే వీరిద్దరు పనిచేస్తున్న రెండు రైళ్లు ఒకే చోట ఆగాయ్. అదే సమయంలో ఇద్దరూ ఒక సెల్ఫీ దిగగా.. దీన్ని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వైరల్ గా మారిపోయింది. రెండు రైళ్లు ఒకే సెల్ఫీ అంటూ ఒక క్యాప్షన్ ఈ ఫోటోకి జోడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: