ఒకప్పుడు పోలీస్ కమిషనర్గా పనిచేసిన సమయంలో నేరస్థుల గుండెల్లో గుబులు పుట్టించే వాడు సజ్జనార్.  ఇక ఇప్పుడు టిఎస్ ఆర్టిసి ఎండి గా మారిపోయిన తర్వాత అదే రీతిలో ఎంతో దూకుడుగా ముందుకు సాగుతున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీ సంస్థను ప్రజలందరికీ మరింత చేరువ చేసేందుకు ఇటీవల కాలము సజ్జనార్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం గా మారిపోతున్నాయి. అంతేకాకుండా ఇక ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు సజ్జనార్ మరింత వినూత్న దారులు వెతుకుతున్నారు అనే చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు సజ్జనార్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు అన్నది తెలుస్తుంది. ఈనెల 19వ తేదీన ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ అందరికీ కూడా ఒక ఆఫర్ ప్రకటించారు సజ్జనార్. ఫాదర్స్ డే రోజు ఫాదర్స్ అందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారుల తండ్రులకు మాత్రమే ఈ అవకాశం ఉంది అంటూ తెలిపింది. ఐదేళ్లు అంత కంటే తక్కువ వయసున్న చిన్నారుల తండ్రులు ఆర్టీసీలో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా ఉచితంగా ప్రయాణించవచ్చు అంటూ టీఎస్ఆర్టీసీ ప్రకటించడం గమనార్హం. టికెట్ లేకుండా వారంతా ఆర్టీసీ ఏసీ నాన్ ఏసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చట.


 అయితే ఈ సౌకర్యం కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి అంటూ టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇక ఇందుకు సంబంధించిన వివరాలను సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం గమనార్హం. ఆర్టీసీ అందించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇక ఐదేళ్ల లోపు పిల్లల తండ్రులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న  సజ్జనార్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తో అందరినీ ఆశ్చర్యపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: