ఇక దేశంలో నిరంకుశ పాలన చేపడుతున్న ప్రధాని మోదీని గద్దె దించడం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు.సీఎం కేసీఆర్‌ తలపెట్టిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి మద్దతు కోసం యూరప్‌ పర్యటనలో ఉన్న మహేష్ బిగాల ఆస్ట్రియాలో ఎన్నారై లతో సమావేశమవ్వడం జరిగింది.ఇక అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నారైలలో బీఆర్ఎస్ పైన విశేష స్పందన అనేది లభిస్తుందన్నారు. ముఖ్యంగా ఉత్తర భారత ఎన్నారైల నుంచి కూడా అద్భుత మద్దతు లభిస్తున్నది మహేష్‌ తెలిపారు. ఇంకా అలాగే దేశంలో ప్రత్యామ్నాయ పార్టీ కి ఆవశ్యకత ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశమంతా కూడా విస్తరించాలన్నారు. అలాగే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్స్ ప్రతి రాష్ట్రంలో కట్టాలన్నారు. మిషన్ భగీరథలాగా ప్రతి రాష్ట్రం లో కూడా ఇంటిటికి తాగు నీరు రావాలన్నారు.


ఇక ప్రధాని మోదీని ఎదుర్కొనే శక్తి ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఉందని ఉత్తర భారత ఎన్నారైలు భావిస్తున్నారని ఆయన పేర్కొనడం జరిగింది. ఇంకా అలాగే ఉత్తర భారత ఎన్నారైలు కేసీఆర్‌తో జూమ్ మీటింగ్ పెట్టమని కూడా ఆయన కోరారు. బీఆర్‌ఎస్‌ పైన దిశా నిర్దేశం చేయాలని కూడా వారు సూచించినట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని మోడీ గ్రాఫ్ పడిపోయిదని ఇంకా కాంగ్రెస్ కి కూడా ఎలాంటి ఫ్యూచర్ లేదని ఎన్నారైలు తెలిపినట్లు మహేష్‌ తెలిపారు.ఇక ఈ కొత్త పార్టీ పెట్టడానికి ఇదే మంచి తరుణమని కూడా ఆయన అన్నారు.ఇంకా అలాగే త్వరలోనే టీఆర్‌ఎస్‌ ఆస్ట్రియా కొత్త కార్యవర్గం కూడా ప్రకటిస్తామన్నారు. కారక్రమంలో అనుమాండ్ల లక్ష్మా రెడ్డి ఇంకా  బొల్లాడి లక్ష్మా రెడ్డి, సంతోష్ ఇంకా కంది వంశీ, కోరండ్ల ప్రవీణ్, రంగు మహేష్, దోర్నాల సంతోష్, శ్రీనివాసరావు, రమేష్, శ్రీనివాస్, అశోక్, భరత్ ఇంకా సత్యజిత్ అలాగే రూపేష్ జైస్వాల్ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: