ఇక ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షాలపై తెలంగాణ మంత్రులు నిప్పులు చెరిగారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ రావాల్సిన అవసరం అనేది లేదని.. ప్రస్తుతం ఉన్న కేసీఆరే తెలంగాణకు అతిపెద్ద ఇంజన్ అని వారు అభివర్ణించారు.ఇంకా వారి మాటల్లో విషం తప్ప.. విషయం లేదని కూడా ఆరోపించారు. ఇక విజయ సంకల్ప సభలో.. అన్ని అబద్ధాలే చెప్పారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకు అసలు ఏ ఇంజిన్లు అవసరం లేదని... సీఎం కేసీఆరే అతిపెద్ద ఇంజిన్ అని పేర్కొన్నారు.బీజేపీ నేతల మాటల్లో అసలు విషం తప్ప విషయం లేదని.. వారు చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారని తెలంగాణ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో నీళ్లు నియామకాల విషయంలో కేంద్ర మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై కూడా హరీశ్రావు స్పందించారు. 'అమిత్షా.. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు వచ్చింది నిజం కాదా? నీళ్లు ఎలా వచ్చాయో ఇక్కడి రైతులే మీకు చెబుతారు. నీళ్లు వచ్చాయనేందుకు ఇక్కడ పండిన పంటలే నిదర్శనం. లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పారు. ఈ నీళ్లు రానిదే ధాన్యం ఎలా వచ్చింది? మీరెలా కొన్నారు?`` అని నిలదీశారు.


పంజాబ్ రాష్ట్రం తర్వాత అత్యధికంగా వరి పండించేది తెలంగాణ అని నీతి అయోగ్ చెప్పిందని మంత్రి హరీశ్ గుర్తు చేశారు. ఇంకా అలాగే గోదావరి కృష్ణా జలాలు తెలంగాణ బీడు భూముల్లో పారాయన్నారు. ఈ నీళ్ల గురించి బీజేపీ కార్యకర్తలను కాదు.. తెలంగాణ రాష్ట్ర రైతుల్ని అడిగితే చెప్తారని మండిపడ్డారు. మన దేశంలో సగటున 3శాతం వ్యవసాయ వృద్ధిరేటు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 10శాతం ఉందని తెలిపారు. అమిత్షా అవగాహన లేకుండా మాట్లాడి స్థాయిని తగ్గించుకోవద్దని కూడా సూచించారు.ఇక తప్పుగా రాసిచ్చిన స్క్రిప్టును చదివారని ప్రజలు అనుకుంటున్నట్లు వివరించారు.ఇక తెలంగాణలో డబుల్ ఇంజిన్ కోసం పట్టాలు వేస్తున్నామని బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారని..బీసీ గణన చేయనందుకా లేక బీసీలకు మంత్రిత్వ శాఖ ప్రకటించనందుకా.. అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు. ఇక ఖమ్మం లకారం ట్యాంక్ బండ్పై తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కోమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి  బీజేపీ నేతల తీరుపై ధ్వజమెత్తడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: