ఇటీవలి కాలంలో ఎన్నో రెస్టారెంట్లు కస్టమర్ల దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కేవలం ఇక తమ రెస్టారెంట్ లో దొరికే ఆహార పదార్థాలు ఏంటి.. అంతేకాదు అందులో స్పెషల్ ఏంటి అన్న విషయాలను తెలియజేస్తూ అక్కడక్కడా కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రచారం చేసేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం మరింత వినూత్నంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనే చెప్పాలి. ముఖ్యంగా ఆహార ప్రియులు అందరిని ఆకర్షించే విధంగా సరి కొత్త ఆఫర్లను తెరమీదికి తీసుకువస్తూ తమ రెస్టారెంట్  స్థానికంగా అందరికీ తెలిసేలా చేస్తూ ఉన్నారు.


 ఈ క్రమంలోనే ఇలాంటి వినూత్నమైన ఆఫర్లు అటు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక బంపర్ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒక సమోసా తినడం చాలెంజ్. సమోసా తింటే  51000 ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. ఒకవేళ తిన లేకపోతే మనం ఎక్కువ చెల్లించాల్సిన పనిలేదు. కేవలం సమోసా ధర ఎంతో అంతే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ వినగానే వెంటనే సమోసా తినేసి 51000 గెలుచుకోవాలి అని అనిపిస్తుంది కదా. ఆఫర్ విన్న తర్వాత ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ ఈ వినూత్నమైన ఆఫర్ లో ఉన్న కిటుకు గురించి తెలిసిన తర్వాత కొంతమంది వెనకడుగు వేస్తారు అని చెప్పాలి.



 ఎందుకంటే ఇలా ఆఫర్ లో తినాల్సిన సమోసా నార్మల్ సమోస  కాదు ఏకంగా ఎనిమిది కేజీల బరువు ఉండే భారీ బాహుబలి సమోసా. మీరట్  చెందిన శుభమ్ కౌశల్ అనే వ్యక్తి తాను తయారు చేసే బాహుబలి సమోసా తినే దమ్ముందా అంటూ ఛాలెంజ్ విసిరాడు. ఒకవేళ తింటే 51 వేల బహుమతి ఇస్తాను అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఇక 8 కేజీల బరువు ఉండే ఈ సమోసాను 30 నిమిషాలు తినాల్సి ఉంటుంది అంటూ షరతు విధించాడు. ఇక ఈ సమోసా తినాలి అంటే శుభమ్ గంటన్నరపాటు కష్టపడతాడట. అంతేకాదు ఇక 1100 రూపాయలు ఖర్చవుతాయట. ఇక ఈ విషయం తెలిసి కొంతమంది ఆహార ప్రియులు చాలెంజర్ స్వీకరిస్తే మరికొంతమంది వెనకడుగు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: