ఏపీలో ఇప్పుడు జనసేన టాపిక్ చర్చనీయాంశంగా మారింది.వైసీపిని ఎలాగైనా పడ గోట్టాలి అనే విధంగా పవణ్ స్పీచ్ లు వ్యూహ రచనలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎలాగైనా జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నారు.అతని స్పీచ్ కు ముగ్దులైన వారంతా పవన్ కు మద్దతు తెలుపుతూన్నారు.ఈ విషయం పై తాజాగా నటుడు, రాజకీయ నేత మురళీ మోహన్ మాట్లాడారు..తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుత రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారీ టీడీపీ సీనియర్‌ నేత.జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కచ్చితంగా ముఖ్యంత్రి అవుతారని మురళీ మోహన్ జోస్యం చెప్పారు.


అది ఎప్పుడనే విషయం తెలియకపోయినప్పటికీ, ఏదో రోజు మంచి స్థానానికి తప్పకుండా చేరుకుంటారని చెప్పుకొచ్చారు. పవన్‌తో పాటు, మెగా బ్రదర్స్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు మురళీ మోహన్‌. ప్రస్తుతం క్రీయాశీలక రాజకీయాల్లో లేనని, ఏపీ పాలిటిక్స్‌ గురించి మాట్లాడను అంటూనే జనసేనాని గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు.. వారి వల్ల కాకపోతే వెళ్లిపోతారు.. పవన్ కళ్యాణ్ అలా కాదు.. తను సక్సెస్ అయ్యినా అవ్వకపోయినా.. పార్టీని నమ్ముకుని.. కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుతున్నారు.


అతనిలో నాకు నచ్చే అంశం అదే. పవన్‌ ఏదో ఒక రోజు తప్పుకుండా ముఖ్యమంత్రి అవుతారు. అలా అయినరోజున మా సినిమా వాళ్ల నుంచి మరొకరు ముఖ్యమంత్రి అయ్యాడని గర్వపడతా. పవన్ కళ్యాణ్‌తో ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదు కానీ.. నేను పోటీ చేసినప్పుడు బీజేపీ, జనసేన నాకు సపోర్ట్ చేశాయి. ఆ సమయంలో నా తరుపున రాజమండ్రిలో పవన్‌ ప్రచారం చేశారు’ అని చెప్పుకొచ్చారు..ఇకపోతే మెగా ఫ్యామిలీ లో పవన్ చాలా సైలెంట్.. ముక్కు సూటి మనిషి..చెప్పింది చేస్తాడు. అందుకే ఆయనకు అభిమానులు ఎక్కువే..ప్రజల సపోర్ట్ ఎక్కువే..ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: