కానీ ఇక్కడ విద్యార్థులు చేసిన వినూత్నమైన ఆలోచన తో ప్రస్తుతం కాడెద్దుల కు కాస్త శ్రమ తగ్గే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. మహారాష్ట్రలోని ఇస్లాంపూర్ కు చెందిన కొంతమంది విద్యార్థులు అక్కడి ఆర్ఐటీ లో మొబైల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఈ క్రమంలోనే ఒక వినూత్నమైన ఆవిష్కరణ కు శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రలో 200 వరకు పంచదార పరిశ్రమలు ఉన్నాయి. కాగా సమీప గ్రామాల నుంచి చెరుకుని పరిశ్రమలకు తీసుకెళ్లాలంటే వందలాది మంది ఎడ్లబండిని ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే ఇక సదరు విద్యార్థులు కళాశాల కు వెళుతున్న సమయంలో భారీ లోడుతో ఉన్న బండ్లను ఎడ్లు లాగడంలో ఎంతో కష్టపడడం చూశారు.
ఎలాగైనా వాటికి శ్రమను తాగించాలి అని భావించారు. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఈ ప్రాజెక్టుకు సారథి అనే పేరు పెట్టుకుని థర్డ్ రోలింగ్ సపోర్టు అనే అని పరికరాన్ని కనుగొన్నారు. బండి కాడికి రెండు వైపులా ఎడ్లు కడతారు. రెండింటి మధ్యలో కాడికి ఒక చక్రాన్ని బిగించారు . విద్యార్థులు కనుగొన్న సరికొత్త పరికరం ద్వారా అటు ఎడ్లు బండిని ముందుకు లాగుతున్న సమయంలో ఇక ఈ చక్రం సహాయంతో ఎంతో సులభంగానే బండి ముందుకు కదులుతోంది అనే చెప్పాలి. తద్వారా కాడెడ్లకు ఇక ఎంతగానో శ్రమ తగ్గుతుంది. అయితే ఇక ఈ సరికొత్త పరికరాన్ని రానున్న రోజుల్లో అందరు రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని సదురు కళాశాల విద్యార్థులు చెబుతున్నారు.