చంద్రబాబునాయుడు అండ చూసుకుని ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఎలాగుంటుందనేందుకు మరో ఉదాహరణ కనబడుతోంది. ప్రత్యర్ధులపైకి తన మద్దతుదారులను చంద్రబాబు బాగా రెచ్చగొడుతున్నారు. పార్టీ అధ్యక్షుడి అండ చూసుకుని కొందరు రెచ్చిపోతుంటే చంద్రబాబు వాడకం తెలిసిన మరికొందరు జ్ఞానులు మాత్రం జాగ్రత్తపడుతున్నారు. అయితే ఓవర్ యాక్షన్ చేసినవాళ్ళకు ఆ తర్వాత మాత్రం గట్టిదెబ్బ పడిపోతోంది. తాజాగా తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత పరిస్ధితే నిదర్శనం.





ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అనిత చాలా దూకుడుమనిషి. తమపార్టీని లేదా అధ్యక్షుడిని ప్రత్యర్ధులు విమర్శలు గుప్పించినపుడు, ఆరోపణలు చేసినపుడు గట్టి రిప్లై ఇవ్వటంలో తప్పులేదు. అయితే చంద్రబాబు అండచూసుకుని ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఎలాగుంటుందో అనితకు ఇపుడు ప్రత్యక్షంగా అనుభవమైనట్లుంది. సంబంధమే లేకుండా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిపైన బురదచల్లేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు.





తన టార్గెట్ ను రీచవ్వటంలో భాగంగా నోటికొచ్చినట్లు మాట్లాడేస్తుంటారు. ఒక్కోసారి బూతులు కూడా మాట్లేస్తుంటారు. మహిళా నేత, అందులోను ఎస్సీ కాబట్టి ప్రత్యర్ధులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. అయితే ఐదురోజుల క్రితం అనిత మాట్లాడుతు జగన్ భార్య భారతి గురించి నోరుపారేసుకున్నారు. దాంతో వైసీపీ తరపున రోజారాణి అనే మహిళా నేత అనితను ఉద్దేశించి మాట్లాడుతు చాలా నీచమైన భాషను ఉపయోగించారు. మీడియా సమావేశంలో రోజారాణి మాట్లాడిన మాటలు విన్నవారు చాలా ఇబ్బందిపడ్డారు.






ఆమె దెబ్బకు అనిత నోరుపడిపోయింది. ప్రత్యర్ధులపైన విరుచుకుపడిపోయే అనిత ఇప్పటికి ఐదురోజులు అయినా వైసీపీ నేతకు కౌంటరుగా ఏమీ మాట్లాడలేదు. అనిత కాదుకదా అసలు టీడీపీ నుండే ఏ నేత కూడా నోరిప్పలేదు. చంద్రబాబుతో పాటు సీనియర్లంతా కలిసి అనితను ఆమె ఖర్మానికి వదిలేశారు. గతంలో ఎంఎల్సీగా పనిచేసిన రాజేంద్రప్రసాద్ అనే నేతకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. టీడీపీ చర్చల్లో వైసీపీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. ఒకసారి టీవీ డిబేట్లో మాట్లాడితే వల్లభనేని వంశీ అనే టీడీపీ తిరుగుబాటు ఎంఎల్ఏ బూతులతో రాజేంద్రప్రసాద్ ను గట్టిగా తగులుకున్నారు. అప్పుడు ఆ ఎంఎల్సీకి కూడా ఎవరు మద్దతుగా నిలవలేదు. అప్పటినుండి ఆయన సైలెంట్ అయిపోతే ఇపుడు అనిత వంతొచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: