తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతలు ఒళ్లు వంచడం లేదని నారా చంద్రబాబు నాయుడు మందలించారు. ప్రజా సమస్యలపై పోరు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై కొంతమంది నేతలు నిర్లక్ష్యం వహిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం తెలుస్తుంది. తమను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారని చెబుతూ.. ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని మందలించినట్టు సమాచారం తెలుస్తోంది. కొంతమంది నేతలు పోలీసులతో వాదించి.. గృహనిర్బంధాలను ఛేదించుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంటే మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారంటూ కొంతమంది నేతలను చంద్రబాబు నిలదీసినట్టు సమాచారం తెలుస్తుంది.ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ప్రజా సమస్యలపై నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెడతారని.. అయితే ఏమవుతుందని చంద్రబాబు తన పార్టీ నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. తనతోపాటు తన కుమారుడు నారా లోకేష్ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వంటివారిపైనా కేసులు పెట్టారని చంద్రబాబు గుర్తు చేసినట్టు సమాచారం తెలుస్తుంది. ఇంకా అలాగే ప్రజా సమస్యలపై పోరాడే నేతలపై కొన్ని కేసులు పెడతారని.. కేసులకు భయపడి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఎలా అని చంద్రబాబు గట్టిగానే కొంతమంది నేతలకు క్లాస్ కూడా తీసుకున్నారట.


ఇకపై పార్టీ కార్యక్రమాలు ప్రజా సమస్యలపై నిర్వహించే పోరులో పాల్గొనని వారిని నిశితంగా పరిశీలిస్తామని చంద్రబాబు హెచ్చరించినట్టు సమాచారం తెలుస్తుంది. పోరాడకుండా ఇంట్లోనే కూర్చుని.. నటిస్తున్నవారి వివరాలను రికార్డు చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. ఇలాంటి నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు కూడా ఇచ్చేది లేదని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. నియోజకవర్గాల్లో ఉండి కూడా కొంతమంది నేతలు ఆయా కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని.. కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన అవసరం లేదా అని చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎవరు పనిచేస్తున్నారో.. ఎవరు పనిచేయడం లేదో పార్టీ కార్యాలయానికి మొత్తం సమాచారం వస్తోందని చంద్రబాబు పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారని చెబుతున్నారు.వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేతలుగా ఎదుగుతారని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారని సమాచారం. పార్టీ కోసం పనిచేయనివారిని ఎత్తుకొని మోయాల్సిన అవసరం తనకు లేదని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీకేమీ నాయకుల కొరత లేదని.. ప్రతిచోటా 10 మంది రెడీగా ఉన్నారని చంద్రబాబు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది పార్టీ నేతలు మారకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: