అటువంటి ఇబ్బందికర జిల్లాలలో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం కూడా ఒకటి. ఈ జిల్లాలో మొత్తం 10 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో గత ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది వైసీపీ. కానీ ఈ సారి పరిస్థితి అలా లేదు. దీనికి కారణం ఆ జిల్లాలో ఉన్న సీనియర్ నేతలు యాక్టీవ్ గా లేకపోవడమే అని తెలుస్తోంది. ధర్మాన బ్రదర్స్ ఈ జిల్లాలో వైసీపీకి కీలకం అని తెల్సిందే. ధర్మాన కృష్ణ దాస్ ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు గా ఉన్నారు మరియు ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖా మంత్రిగా ఉన్నారు.
కాగా వీరిద్దరూ జిల్లాలో అంత దూకుడుగా లేరన్నది సర్వే ప్రకారం వినిపిస్తున్న మాట. అందులోనూ ఈ జిల్లాలో అచ్చన్నాయుడు మరియు రామ్మోహన్ నాయుడు ప్రభావవంతంగా ఉండడం వలన ప్రతిపక్ష టీడీపీ బలపడుతూ వస్తోంది. కాగా ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే మాత్రం వైసీపీకి రెండు సీట్లు దక్కుతాయని తెలుస్తోంది. ఈ విషయం పట్ల వైసీపీ హై కమాండ్ అసంతృప్తిగా ఉన్నారట. మరి ఇక ఉన్న కొద్దీ కాలంలో ధర్మాన బ్రదర్స్ తమ జోరు చూపించి వైసీపీ కి గతంలో కన్నా మించిన ఫలితాన్ని అందిస్తారా చూడాలి.