చెడ్డి గ్యాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్నాళ్ల క్రితం వరకు తెలంగాణ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ మళ్లీ రెచ్చిపోతోంది.తాజాగా సంగారెడ్డి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. హైదరాబాద్ నగర శివారులోని అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ఓ ఇంట్లోకి చొరబడి 12తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.వివరాల్లోకి వెళ్తే.. అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి బృందావన్ టీచర్స్ కాలనీలోని విల్లా నెంబర్ 8లోకి చొరబడిన దొంగలు బీరువాలో దాచిన 12తులాల బంగారం ఎత్తుకెళ్లారు. దొంగతనం జరిగినట్లు గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాలనీలో ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీ పరిశీలించి చెడ్డీ గ్యాంగే ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించారు.కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలు చెడ్డీ గ్యాంగ్ పేరు చెబితేనే వణికిపోయేవి. అర్ధరాత్రి వేళ చెడ్డీల మీద తిరుగుతూ చోరీలకు పాల్పడటం ఈ గ్యాంగ్ ప్రత్యేకత. గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లు.. ఇలా ఎక్కడబడితే అక్కడ ఈ ముఠా చోరీలకు పాల్పడుతూ ప్రజలను హడలెత్తించేది.


అయితే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసులు మూకుమ్మడిగా నిఘా పెట్టడంతో చెడ్డీ గ్యాంగ్ కదలికలు ఆగిపోయాయి. కొందరు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. కొంతకాలంగా ప్రశాంతంగా నిద్రపోతున్న హైదరాబాద్, శివారు జిల్లాల ప్రజలకు తాజా ఘటన ఆందోళనకు గురిచేస్తోంది. చెడ్డీ గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.ఇంకా అలాగే తిరుపతి నగరంలోని తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చెడ్డి గ్యాంగ్  కలకలం రేగింది. బృందావన కాలనీలో ప్రహరీ గోడ దూకి ఓ ఇంటిలోకి ప్రవేశించిన దుండగులు చోరీకి తెగబడ్డారు.చెడ్డీ గ్యాంగ్‌లోని ఒకడు చేతిలో ఇనుప రాడ్డు పట్టుకుని తచ్చాడుతున్న వైనం భయాందోళనకు గురి చేసింది. చడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవడంతో తిరుచానూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశారు. చడ్డీగ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.కాబట్టి జాగ్రత్తగా వుండండి. నైట్ కానీ పగలు కానీ ఖచ్చితంగా డోర్స్ లాక్ చేసుకోండి. కొత్త వాళ్ళు తలుపు కొడితే అస్సలు తీయకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: