ఇక నెల్లూరులో దంపతుల హత్య ఘటనను మరవకముందే మరోసారి హత్యలు జరగడం చాలా కలకలం రేపాయి.నెల్లూరు రూరల్ మండల డైకాస్ రోడ్డు సెంటర్ టైలర్స్ కాలనీలో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి చాలా దారుణంగా చంపేశారు.రమణారెడ్డి, శ్రీకాంత్ అనే వ్యక్తులు మద్యం సేవిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆటోలో వచ్చి కిరాతకంగా కత్తిలో పొడిచాడు. దీంతో ఘటనాస్థలంలోనే వారు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అప్పటికే మృతి చెందిన రమణారెడ్డి, శ్రీకాంత్ల మృతదేహాలను నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. హత్య చేసిన వ్యక్తి ఎవరు.. హత్యకు గల కారణాలు ఏమిటి.. అనే విషయాలు తెలియాల్సి ఉంది. హంతకుని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వాటి సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వరసగా జరుగుతున్న హత్యలు పోలీసులకు సవాల్ గా మారాయి.గతంలో నెల్లూరులోని అశోక్ నగర్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు.


దొంగతనం కోసం ఓ ఇంటికి వెళ్లిన దుండగులు డబ్బులు నగలు ఇవ్వాలంటూ మహిళను కర్రతో కొట్టి చంపేశారు. అదే సమయంలో ఇంటికి వస్తున్న యజమానిని అడ్డుకున్నారు. దారుణంగా గొంతు కోసి ఆయన్నూ చంపేశారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. రాత్రి ఘటన జరగగా ఉదయం స్థానికులు గుర్తించారు. బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.కాగా.. వరసగా జరుగుతున్న హత్యలు నగరవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. పోలీసులు, అధికారులు వీటిపై చర్యలు తీసుకుని నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి దారుణమైన ఘటనలు మళ్ళీ కూడా జరగకుండా రక్షణ కల్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: