కానీ ఏకంగా పెళ్లి వేదికపైనే వధువు వరుడికి ఒక బాండ్ రాసి ఇవ్వడం గురించి ఎప్పుడైనా చూసారా.. సినిమాల్లో వినడం తప్ప నిజ జీవితంలో చూడలేదు అని చెబుతారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటిదే జరిగింది. వధువు వరుడికి ఏకంగా బాండ్ రాసింది. ఇంతకీ ఈ బాండ్ ఎందుకో తెలుసా.. క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇవ్వడం విషయంలో రాసింది. ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా.. ఇక్కడ జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలు తెలిస్తే.. మీకు ఒక క్లారిటీ వస్తుంది.
తమిళనాడులోని మధురై లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వారాంతంలో క్రికెట్ ఆడేందుకు తన భర్తను అనుమతిస్తాను అంటూ ఒక నవవధువు బాండ్ పేపర్ పై రాసి ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. హరి ప్రసాద్ అనే యువకుడు తేనిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. ఈయన సూపర్ స్టార్ క్రికెట్ క్లబ్ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరిస్తున్నాడు అని చెప్పాలి. ఇటీవలే పూజా అనే యువతితో ఇతనికి వివాహం జరిగింది.. పెళ్లికి వచ్చిన అతని స్నేహితులు పెళ్లి వేదికపైనే పెళ్లి కుమార్తెకు ఓ షరతు విధించారు. శనిఆదివారాలు హరిప్రసాద్ కు క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని కోరారు. ఈ మేరకు 20 రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం కూడా చేయించారు. దీనిపై వధువు కూడా వెనక ముందు ఆలోచించకుండా సంతకం చేయడం గమనార్హం.