స్మార్ట్ ఫోన్ లు, ఇంటర్నెట్‌ వుంటే యూత్ ఇక ఆగుతారా..24 గంటలు అందులోనే కాలం గడుపుతారు..సోషల్ మీడియా లో ప్రపంచంలో జరిగే అన్ని కూడా వెంటనే తెలుస్తాయి.అందులో ఎక్కువగా వాట్సాప్ ను ఎక్కుబ మంది వాడు తున్నారు..వినియోగదారుల సేఫ్టీ కోసం ఆ కంపెనీ కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది..ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.వాట్సాప్‌ మెసేజింగ్ యాప్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ యాప్‌కు అంతటి ప్రాధాన్యత.ప్రత్యర్థి సంస్థల నుంచి ఎంత పోటీ ఎదురైనా వాట్సాప్‌ మొదటి స్థానంలో నిలవడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికే పలు ఆకట్టుకునే ఆఫర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తూ వస్తోన్న వాట్సాప్‌ తాజాగా మరో ఆకస్తికరమైన ఫీచర్‌ను యూజర్లకోసం తీసుకొచ్చింది. సాధారణంగా వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్‌ చేస్తే ప్రస్తుతం డిలీట్‌ చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. అలా కాకుండా అప్పటికే సెండ్ చేసిన మెసేజ్‌ను ఎడిట్‌ చేసే అవకాశం వుంటే బాగుండు అని చాలా మంది అనుకుంటారు..


అలాంటి ఆప్షన్ ఒకటి వుంటే ఎలా వుంటుంది..తాజాగా వాట్సాప్‌ ఈ ఫీచర్‌పై టెస్టింగ్ చేస్తోంది. తొందరపాటులో పంపిన మెసేజ్‌లో ఏవైనా తప్పులు దొర్లితే.. ఇకపై మెసేజ్‌ను డిలీట్‌ చేసి, మళ్లీ కొత్త మెసేజ్‌ పంపాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త ఫీచర్‌ ఉపయోగపడనుంది. ఎడిట్‌ మెసేజ్‌ ఫీచర్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ అప్‌డేట్‌ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. విజయవంతంగా పరీక్షలు పూర్తికాగానే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే వాట్సాప్‌ ఇటీవలే డిలిట్ ఫర్‌ ఎవ్రీవన్‌ ఫీచర్‌ సమయాన్ని పెంచిన విషయం తెలిసిందే. వీటితో పాటు ప్రైవసీలో భాగంగా ప్రొఫైల్‌ ఫొటో ఎవరికి కనిపించాలో వారికే కనిపించేలా చేసుకునే అవకాశం కూడా కల్పించారు..త్వరలోనే మెసేజ్ ఎడిట్ ఆఫ్షన్ అందుబాటులోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: