అతి పెద్ద ప్రభుత్వం బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం కొత్త బెనిఫిట్స్ ను అందిస్తుంది..పలు పథకాలను అందిస్తూ వస్తుంది.ఇకపోతే యూపీఐ పేమెంట్లు అందుబాటులోకి వచ్చాక దేశంలో చెల్లింపుల తీరుతెన్నులు మారిపోయాయి. 2016లో మొదలైన ఈ పేమెంట్లు జనదరణ పొందుతున్నాయి. భద్రంగా, వేగంగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉండడంతో యూజర్లు కూడా మొగ్గుచూపుతున్నారు..నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. ఆగస్టులో యూపీఐ పేమెంట్ల విలువ ఏకంగా రూ.10.7 లక్షల కోట్లుగా ఉంది.



అయితే, ఈ డిజిటల్ యుగంలో చెల్లింపుల విషయంలో యూజర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాల నేపథ్యంలో అవగాహన పెంచుకుని జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్‌బీఐ.. యూపీఐ పేమెంట్లు చేస్తున్న తన ఖాతాదారుల కోసం కీలకమైన పలు సూచనలు చేసింది..అవేంటో ఒకసారి చూడండి..



యూపీఐ పేమెంట్ టిప్స్..


*. డబ్బుని స్వీకరించే సమయంలో యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. యూపీఐ పిన్ ఎంటర్ చేయాలంటూ ఏమైనా మెసేజీలు వస్తే వాటిని పట్టించుకోకండి.

*. ఏ వ్యక్తికి డబ్బు పంపించాలనుకుంటున్నారో అతడి గుర్తింపుని జాగ్రత్తగా వేరిఫై చేసుకోవాలి. మీరు పంపించాలనుకుంటున్న వ్యక్తి అతడేనా లేక ఫేక్ అకౌంటా అనేది నిర్ధారించుకోవడం ఉత్తమం. ఆ తర్వాత డబ్బు పంపించాలి.
*. డబ్బు కోరుతూ పదేపదే గుర్తుతెలియని విజ్ఞప్తులు వస్తే యాక్సెప్ట్ చేయొద్దు.
*. యుపీఐ అనేది సీక్రెట్ పిన్. సెక్యూరిటీ కోడ్ లాంటి ఈ పిన్‌ని ఎవరికీ తెలియనివ్వకూడదు. డబ్బుని పంపించేటప్పుడు మాత్రమే పిన్‌ని ఉపయోగించాలి. ఎవరితోనూ పంచుకోవచ్చు.
*. షాప్స్ లేదా వ్యక్తుల వద్దైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం ఉత్తమం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు వ్యక్తి వివరాలు కనిపిస్తాయి. వాటిని నిర్ధారించుకోవచ్చు.
*. యూపీఐ పిన్‌ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండటం మంచిది.పిన్ ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు..

మరింత సమాచారం తెలుసుకోండి: