దీపావళి పండుగ అంటే ఎవరికైనా సరదా..పిల్లలకు అయితే ఇక చెప్పనక్కర్లేదు.. టపాసులు, స్వీట్స్ ఉంటాయి.. వారికి ఇష్టమైన టపాసులు కాలుస్తూ సరదాగా ఉంటారు.ఈ పండుగకు టపాసులు కాల్చడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది.కొన్ని సార్లు ప్రభుత్వం కొన్ని వాదనలు వినిపించిన కూడా ఇప్పుడు షరా మామూలు అయ్యింది. దాంతో కాలుష్యం కూడా పెరగనుంది.. ప్రభుత్వం కొన్ని సూచనలు ఇచ్చిన కూడా కాలుష్యం వెలువడుతుంది..దీంతొ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..
కాలుష్యాన్ని తగ్గించడానికి దిల్లీ సర్కార్ ఎన్నో చర్యలు చేపడుతోంది. అయినా ఎయిర్ పొల్యూషన్ దారికి రావడం లేదు. ముఖ్యంగా పండుగల సమయంలో కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది. ప్రధానంగా దీపావళి రోజున పొల్యూషన్ పీక్ కి వెళ్తోంది.



అందుకే దీపావళి రోజున అధికారులు, దిల్లీ ప్రభుత్వం కాలుష్యం పెరగకుండా పటిష్ఠ చర్యలు చేపడుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా ఆ చర్యలు చేపట్టేందుకు దిల్లీ ప్రభుత్వం రెడీ అయింది..

బాణాసంచా పేలుస్తూ చిన్నాపెద్దా అంతా సందడిగా గడుపుతారు. అయితే ఇది కాసేపు హాయినిస్తుంది కానీ దీర్ఘకాలికంగా వాయు కాలుష్యం కలగజేస్తుంది. అందుకే దిల్లీ సర్కార్ కీలకనిర్ణయం తీసుకుంది. దీపావళి రోజున టపాసులు పేలిస్తే.. ఆరు నెలల జైలుశిక్ష విధించనున్నట్లు పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ హెచ్చరించారు. పటాకుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు చేపడితే రూ.5వేల జరిమానా విధించడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు.



దీపావళితో సహా వచ్చే ఏడాది ఒకటో తేదీ వరకు అన్ని రకాల బాణాసంచా ఉత్పత్తి, అమ్మకాలు, విక్రయాలపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తూ సెప్టెంబర్‌లో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దిల్లీ కాలుష్యం నేపథ్యంలో ఆ సర్కారు గత రెండేళ్లుగా ఇదే విధానాన్ని అవలంభిస్తోంది. ఈ నెల 21న ‘దియే జలావో.. పటాఖే నహీ’ (దివ్వెలు వెలిగించండి.. టపాసులు కాదు) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: