రైలులో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది.. దాంతో ప్రభుత్వం కొత్త నిర్ణయాల ను కూడా తీసుకుంటూన్నారు. ఇప్పటికే ఎన్నో ఫెసిలిటీస్ ను అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వేలాది మంది ప్రజలు రైల్వే ద్వారా ప్రయాణిస్తుంటారు. అదే సమయం లో రైల్వే ప్లాట్‌ఫారమ్‌ పై విపరీతమై న జనం ఉండటం తో టికెట్లు దొరక్క, రైలు మిస్సవుతుందన్న భయంతో టికెట్ లేకుండానే రైలు ఎక్కుతున్నారు. ఇక విషయాన్నికొస్తే.. ఆన్‌లైన్ అన్‌రిజర్వ్డ్ రైలు టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని రైల్వే యూటీఎస్‌ యాప్‌ లో అందించింది. యూటీఎస్‌ అప్లికేషన్ ద్వారా రైలు లో ప్రయాణించే ప్రయాణికులు రైలు ఎక్కిన తర్వాత కూడా ఆన్‌లైన్‌ లో అన్‌రిజర్వడ్‌ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.



మొబైల్ యాప్ UTS Android, iOS, Windows వెర్షన్‌ల తో కూడిన స్మార్ట్‌ ఫోన్‌ల లో పనిచేస్తుంది. ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే సమయం లో టిక్కెట్ చెల్లింపు ఆన్‌లైన్‌ లో మాత్రమే చేయవచ్చు. రైల్వే అందించిన ఈ సదుపాయం తో అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌ల తో పాటు ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ల ను కూడా బుక్ చేసుకోవచ్చు..


ఈ టిక్కెట్ ను ఎలా బుక్ చేసుకోవాలంటే..


*. ముందుగా UTS యాప్‌కి వెళ్లండి.

*. సాధారణ బుకింగ్ ఎంపికను ఎంచుకోండి.
*. ఆపై బయలుదేరే స్టేషన్ పేరు/కోడ్, గమ్యస్థాన స్టేషన్ పేరు/కోడ్‌ను నమోదు చేయండి.
*. ప్యాసింజర్, మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ వంటి టిక్కెట్ రకాన్ని ఎంచుకోండి.
*. పేపర్‌, పేపర్‌లెస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
*. వాలెట్‌ లేదా ఇతర ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతుల నుండి చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి.
*. మీ టిక్కెట్ బుకింగ్ గురించి మీకు సందేశం వస్తుంది.
*. యూటీఎస్‌ డాష్‌బోర్డ్‌ లో టికెట్‌ చూచడవచ్చు.
ఇలా చెయ్యడం వల్ల ఫైన్ ల నుంచి ఉపశమనం కలుగుతుంది.. ఈ విధానం పై కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: