పోస్టాఫీసు అందిస్తున్న స్కీమ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..వినియోగదారుల కోసం అనేక పథకాలను తీసుకువస్తుంది. ఈ పథకాలలో ఒకటి గ్రామ సుమంగల్ గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం. ఈ పథకంలో రోజువారీగా కేవలం రూ.95 ఇన్వెస్ట్‌మెంట్‌తో మెచ్యూరిటీ సమయంలో కేవలం దాదాపు రూ. 14 లక్షలను పొందవచ్చు..పల్లెల్లో నివసించే పెట్టుబడిదారుల కోసం ఈ ప్లాన్ తీసుకొచ్చినట్లు ఈ పథకం పేరును బట్టి అర్థమవుతోంది. ఈ పథకం పెట్టుబడిదారుడు మనీ బ్యాక్ పాలసీ అని అదనపు ప్రయోజనం పొందినట్లయితే మీరు మెచ్యూరిటీకి ముందే ఈ పథకం నుంచి డబ్బులను పొందవచ్చు..


గ్రామ సుమంగళ్ యోజన పాలసీని తీసుకోవడానికి పెట్టుబడిదారుడి వయస్సు కనీసం 19 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పథకంలో పాలసీదారుకు మెచ్యూరిటీపై బోనస్ కూడా ఇవ్వబడుతుంది. మీరు దీన్ని 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు కొనుగోలు చేయవచ్చు..మొత్తం డబ్బుల తో పాటు అదనపు డబ్బులను కూడా పొందవచ్చు..


ఈ పాలసీ వల్ల కలిగే ప్రయోజనాల విషయాన్నికొస్తే..15 ఏళ్లు నుంచి 20 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకోవచ్చు. మీరు 15 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకుంటే మీకు 6, 9, 12 పాలసీ టర్మ్స్‌లో 20 శాతం చొప్పున డబ్బులు వస్తాయి. మిగతా 40 శాతం డబ్బులు మెచ్యూరిటీ సమయం లభిస్తాయి. అదే మీరు 20 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకుంటే.. అప్పుడు 8, 12, 16 ఏళ్లలో పాలసీ డబ్బులు 20 శాతం రాగా, మిగతా 40 శాతం డబ్బులు మెచ్యూరిటీ తర్వాత పొందవచ్చు..25 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో పెట్టుబడి పెడితే అతను రూ. 7 లక్షల హామీతో 20 సంవత్సరాల పాటు ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలి. ప్రతి నెలా రూ. 2853 వాయిదా చెల్లిస్తుండాలి. మెచ్యూరిటీ సమయానికి 14 లక్షలను సొంతం చేసుకొవచ్చు...మీకు ఆసక్తి వుంటే మీరు  కూడా ట్రై చెయ్యండి..


మరింత సమాచారం తెలుసుకోండి: