మన దేశంలోని అన్నం పెట్టే అన్నదాతల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఆడుకుంటూంది.. పలు రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది. అందులో ఒకటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరం నుండి ఈ పథకం అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు 6000 రూపాయల ను పెట్టుబడి సాయంగా అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలు అంటే నాలుగు నెలలకు ఒకసారి 2000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనుంది.



ఈ క్రమంలో “పీఎం కిసాన్ సమ్మాన్ యోజన” పథకంకి.. వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించింది. 2019 నుండి 12 విడుదలగా 24 వేల రూపాయలు అన్నదాత బ్యాంక్ లో కేంద్రం జమ చేసింది. కాకా ఇప్పుడు డిసెంబర్ 15 నుంచి 20 వరకు 13వ విడత డబ్బులు… రైతుల ఖాతా లో వేయటం కోసం కేంద్రం రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను కేంద్ర pmkisan.gov.in లో తెలియజేయనుంది.



అధికార వెబ్‌సైట్ నుంచి అర్హులు కలిగిన రైతులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే 12 వ విడత నుండి కేంద్రం ఈ పథకం వర్తింప చేయాలంటే రైతులకు e-KYC తప్పనిసరి చేయడం జరిగింది. గతంలో దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఉద్యమం తో కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ… రైతుల విషయం లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. దీనిలో భాగంగా.. “పిఎం కిసాన్ సమ్మన్ యోజన” పథకం ద్వారా రైతుల కు మేలు చేకూర్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తూ ఉంది.. కిసాన్ క్రెడిట్ కార్డు నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: