అయితే అవయవ దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చు అని ఎంతలా అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఎంతోమంది అవయవదానం చేయడానికి ముందుకు రావడం లేదు అని చెప్పాలి. కానీ కొంతమంది మాత్రం అవయవదాన విషయంలో ఎంతో గొప్పగా ఆలోచిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. రాజస్థాన్లోని బిల్వారాలో ఇలాంటి తరహా కఠిన వెలుగు చూసింది. భూపాల్ సింగ్ రాథోడ్ భార్య కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది అని చెప్పాలి. అయితే ఆమె తన భర్త దగ్గర 2019లో ఒక మాట తీసుకుంది
ఒకవేళ నేను అనారోగ్యంతో చనిపోతే.. నా మృతదేహాన్ని దహనం చేయకండి.. మెడికల్ కాలేజీకి ఇచ్చి అవయవ దానం చేసి.. కొంతమంది ప్రాణాలు అయినా నిలబెట్టడానికి ప్రయత్నించండి అంటూ ఒక మాట తీసుకుంది. ఇకపోతే ఇటీవల సదరు మహిళ అనారోగ్య సమస్యలతో మరణించింది. దీంతో భర్త భూపాల్ సింగ్ రాథోడ్ ఇక భార్యకు మాట ఇచ్చిన విధంగానే చివరి కోరిక తీర్చాడు. విజయ్ రాజే సేంతియా మెడికల్ కాలేజీకి మృతదేహాన్ని అప్పగించాడు.. అవయవ దానం ఎంతో గొప్పదని ప్రతి ఒక్కరు కూడా అవయవదానం చేయాలంటూ సదరు వ్యక్తి సూచించాడు.