రైల్లో ప్రయాణం చాలా సేఫ్.. అందుకే ఎక్కువ మంది ప్రయాణం చెయ్యడానికి ఆసక్తి చూపిస్తుంటారు... అదే విధంగా దూరపు ప్రయాణాలు చేసేవారి కోసం అధికారులు కొత్త సర్వీసులను అందించడం తో పాటు,కొత్త సదుపాయాల ను అందిస్తున్నారు. అయితే కొంత మంది కొన్ని తప్పులను చేస్తారు వాటి వల్ల కొన్ని సార్లు దొరికితే భారీ జరిమానా తో పాటు,జైలుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది.తక్కువ ధరలో, సురక్షితమైన సేవలు అందిస్తోంది కాబట్టే రైల్వేకు ఇంతటి ప్రాముఖ్యత ఉంది.



ఇండియన్‌ రైల్వే వల్ల కోట్లాది మందికి ఉపాధి లభిస్తోంది. ప్రతి రోజూ ప్రయాణించే లక్షలాది మందికి రక్షణ కల్పించడంలో రైల్వే శాఖ పెద్ద పీట వేస్తుంది. ప్రయాణికుల భద్రత విషయం లో రాజీపడని రైల్వే శాఖ కొన్ని కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే రైళ్లలో ప్రయాణించే సమయం లో కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లకూడద నే నిబంధనలు ఉన్నాయి. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని, రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశం తోనే రైల్వే శాఖ ఈ నిబంధనలు తీసుకొచ్చింది. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే జైలుకు వెళ్లాల్సిందే..



రైలులో ప్రయాణించే సమయం లో క్రాకర్స్‌, గ్యాస్‌ సిలిండెర్‌, సిగరెట్లు, గన్‌పౌడర్‌ లాంటి పేలుడు పదార్థాలను ఎట్టి పరిస్థితు ల్లో తీసుకెళ్లకూడదు. అంతేకాకుండా రైళ్ల లో కిరోసిన్‌, పెట్రోల్‌ వంటి మండే వస్తువుల రవాణ కూడా చట్ట విరుద్దం. అలాగే రైల్వే కంపార్ట్‌మెంట్‌ లేదా స్టేషన్‌ లో పొగ తాగడం నిషేధించారు. రైల్వే చట్టం 1989లోని సెక్షన్లు 164, 165 ప్రకారం రైలులో ప్రయాణించే సమయంలో పేలుడు పదార్థాలను రవాణా చేస్తే రూ. 1000 వరకు జరిమానా లేదా మూడేళ్లు జైలు శిక్ష.. కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశాలు ఉంటాయి.. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణం చెయ్యడం మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి: