ప్రభుత్వ భీమా ఇన్స్యూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ కస్టమర్ల కోసం మరో ప్లాన్ ను అందుబాటులోకి తీసుకోని వచ్చింది.ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసినట్లయితే మెరుగైనా లాభాలు అందుకోవచ్చు. ఎల్‌ఐసీలో ఉన్న ఓ స్కీమ్‌లో మీరు ప్రతిరోజూ రూ. 260 పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.54 లక్షల వరకు రాబడి పొందవచ్చు. నేటి కాలంలో పెట్టుబడికి సంబంధించి అనేక ఆప్షన్స్‌ ఉన్నాయి. కానీ ఇప్పటికీ చాలా మంది ప్రజలు ప్రభుత్వ పథకాలు, పెన్షన్ పథకాలలో డబ్బును పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకంటే ఈ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం సురక్షితమైనది. అలాగే మంచి రాబడి పొందే అవకాశం కూడా ఉంటుంది.


భీమాలో సురక్షితమైన పెట్టుబడి కోసం చాలా మంది ప్రజలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. తక్కువ డబ్బుతో కూడా ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇక ఎల్‌ఐసీ ప్రవేశపెట్టే పథకాల్లో జీవన్ లాబ్ పాలసీ ఒకటి. ఇది పరిమిత ప్రీమియం చెల్లింపుతో నాన్-లింక్డ్ ప్రాఫిట్ ప్లాన్. ఈ పాలసీ కింద మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత పాలసీదారుకు ఏకమొత్తం మొత్తం ఇవ్వబడుతుంది. అయితే పాలసీదారుడు మరణిస్తే అతని కుటుంబానికి డబ్బులు వస్తాయి..ఇది స్టాక్ మార్కెట్ లింక్డ్ ప్లాన్ కాదు. ఇందులో అనుకున్న సమయంలో పెట్టుబడి పెట్టబడుతుంది..


జీవన్ లాభ్ పాలసీ యోజన మెచ్యూరిటీ సమయంలో పాలసీదారుకు పూర్తి హామీతో పాటు రివర్షనరీ బోనస్, చివరి అదనపు బోనస్ ప్రయోజనాన్ని అందిస్తుంది. బీమా చేయబడిన వ్యక్తి 10,13, 16 సంవత్సరాలకు బీమా ప్రీమియంను డిపాజిట్ చేయవచ్చు. వారికి 16 నుండి 25 సంవత్సరాల తర్వాత డబ్బు ఇవ్వబడుతుంది. ఈ పథకాన్ని 8 సంవత్సరాలలో తీసుకోవచ్చు. ఈ పథకానికి గరిష్ట వయస్సు 59 సంవత్సరాలు. 59 ఏళ్ల పాటు బీమా తీసుకునే వ్యక్తులు 16 ఏళ్ల టర్మ్ ప్లాన్‌ను మాత్రమే ఎంచుకోవచ్చు..79 ఏళ్ళకు పెన్షన్ వస్తుంది.


మీకు 25 ఏళ్లు వయస్సు అయితే,ఎల్ఐసీ జీవన్ బీమా లాభ్ పాలసీ కోసం 25 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి కోసం పెట్టుబడి ప్రణాళికను రూపొందించినట్లయితే మీకు రూ.54 లక్షల వరకు మొత్తం ఇవ్వబడుతుంది. ఈ మొత్తాన్ని పొందడానికి మీరు ప్రతిరోజూ రూ.260 పెట్టుబడి పెట్టాలి. అంటే మీరు ఏటా రూ.92,400 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది 25 ఏళ్లలో రూ.20 లక్షలకు చేరుకుంటుంది..మెచ్యూరిటీ సమయంలో రూ.54 లక్షలు పొందవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: