సాదారణంగా ఏటీఎం లో నుంచి డబ్బులను డ్రా చేసుకొవచ్చు..కానీ బంగారం ఇచ్చే మేషన్ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. కనీసం అలాంటిది ఒకటి ఉందని ఊహించి ఉండరు.. కదూ..ఇప్పుడు అలాంటి మిషన్ ఒకటి హైదరాబాద్‌ లో లాంచ్ చేశారు.ఆ మేషన్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..మీరు చదివింది నిజమే, దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను మన హైదరాబాద్‌లో ప్రారంభించారు. గోల్డ్‌ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్‌లో ఉన్న సంస్థ కార్యాలయంలో ఈ ఏటీఎంను శనివారం రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ ఏటీఎంల ద్వారా డెబిట్, క్రెడిట్‌ కార్డు సహాయంతో బంగారం విత్‌డ్రా చేసుకోవచ్చు..


ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్‌ ఏటీఎం నిదర్శనం. బంగారాన్ని తీసుకునేందుకు దేశంలోనే తొలిసారి గోల్డ్‌ ఏటీఎంను నగరంలో ప్రారంభించడం అభినందనీయం. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఈ గోల్డ్‌ ఏటీఎంలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ తరహా ఏటీఎంలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకివస్తే బాగుంటుంది’ అని చెప్పుకొచ్చారు.


గోల్డ్‌ ఏటీఎంల ఏర్పాటుపై గోల్డ్‌ సిక్కా సంస్థ సీఈఓ సయ్యద్‌ తరుజ్‌ మాట్లాడుతూ… ‘వీటి ద్వారా 99.99% నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను విత్‌ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్‌ కార్డులతో పాటు, మేము జారీ చేసే ప్రీపెయిడ్‌ కార్డులనూ ఉపయోగించుకోవచ్చ’ని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ మిషన్‌లలో ఒకేసారి రూ. రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల పసిడిని లోడ్‌ చేయవచ్చు. ఈ ఏటీఎం ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి..

ఇక త్వరలో ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు సయ్యద్‌ తెలిపారు. ఎయిర్‌పోర్ట్, పాతబస్తీలో మూడు ఏటీఎంలు, సికింద్రాబాద్, అబిడ్స్‌లతో పాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్‌లలో కూడా గోల్డ్‌ ఏటీఎంలను ప్రారంభించనున్నామని చెప్పారు.ఇక మరో రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 3000 ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: