సాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు ఇక కొత్త అల్లుళ్లు అత్తారింటికి వెళ్లడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలా అత్తారింటికి వచ్చే కొత్త అల్లుడికి ఎక్కడ ఏమి తక్కువ కాకుండా అన్ని రకాల మర్యాదలు చేస్తూ ఉంటారు అత్తమామలు. ఇక ఆతిథ్యం అనే పదానికి కేరాఫ్ అడ్రస్గా కొనసాగే గోదారోళ్ళు ఇక కొత్త అల్లుడికి ఏ రేంజ్ లో మర్యాదలు చేస్తూ ఉంటారు అన్న విషయం ఇప్పటికే ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
మర్యాదలకు పుట్టినిల్లుగా చెప్పుకునే భీమవరంలో ఇటీవలే అత్తమామలు కొత్త అల్లుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 173 రకాల వంటకాలతో విందు భోజనం వడ్డించారు. దీంతో అత్తమామల మర్యాదతో అల్లుడు ఒక్కసారిగా కంగు తిన్నాడు అని చెప్పాలి. పట్టణానికి చెందిన వ్యాపార వేత్త బద్రి, సంధ్యా దంపతుల నివాసంలో వారి అల్లుడు చలవ పృద్విగుప్త హారికకు ఇటీవలే వివాహం జరిగింది. ఇక ఈ దంపతులు పండుగ సందర్భంగా అత్తారింటికి వెళ్ళగా 173 వంటకాలతో వారికి విందు భోజనం ఏర్పాటు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ ఆరిపోయింది.