పాపం లోకేష్ ఏం మాట్లాడిన ఆడుకోవటానికి నెటిజన్స్ రెడీగా ఉంటారు. వారు మాత్రం ఏం చేస్తారు పాపం .. చినబాబు గారు ట్వీట్స్ అలా ఉంటాయి మరి. లోకేష్ తెలిసి పెడతాడో, తెలియక తప్పులో కాలేస్తాడో తెలియదు కానీ.. చినబాబు సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వాలనుకున్న ప్రతి సారీ మిస్ ఫైర్ అయ్యి కామెంట్లతో ఖంగుతింటున్నారు. ఆమధ్య మహాకవి శ్రీ శ్రీ జయంతి సందర్భంగా ట్వీట్ పెట్టి తిట్లు తిన్న లోకేష్.. తాజాగా జాతీయ సాంకేతికతా దినోత్సవం అంటూ నవ్వులపాలయ్యారు.


ఇంతకీ మందళగిరి లోకేష్ తాజా ట్వీట్ ఏంటంటే.. ఈరోజు జాతీయ సాంకేతికతా దినోత్సవం, శాస్త్ర సాంకేతిక ఫలాలను సామాన్యుల జీవితాల్లోకి తీసుకెళ్లిన చంద్రబాబు ఐదేళ్లలో ప్రభుత్వ శాఖలన్నిటిలో సాంకేతికను ప్రవేశపెట్టి ప్రజలకు అత్యుత్తమ సేవలందించారని పొగడ్తలు కురిపించారు. అంతటితో ఆగకుంటా.. ఫిన్ టెక్, బ్లాక్ చైన్, డేటా సెంటర్ వంటి అధునాతన సాంకేతిక పరిశ్రమలను ఏపీకి తెచ్చిన ఘనత బాబుదేనంటూ కితాబిచ్చారు.


దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సాంకేతికతను, శాస్త్ర విజ్ఞానాన్ని కనిపెట్టింది మా బాబుగోరేనని చెప్పకపోయావా ఓ పనైపోయుండేది అంటూ ఆటాడుకున్నారు. అసలు సాంకేతికత ఎవడబ్బ సొమ్ము, కాలానుగుణంగా అన్ని శాఖల్లో మార్పులు జరుగుతాయి, దాన్ని కూడా మీ ప్రచారానికి వాడుకోవడం ఏంటి అంటూ మరొకరు తగులుకున్నారు. మొత్తానికి లోకేష్ మరోసారి కోరి కోరి నెటిజన్లను కెలుక్కుని బుక్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: