మూడేళ్ల క్రితం ముచ్చట...
 హైద్రాబాద్‌ లోని ఐమాక్స్‌ దగ్గర , జిహెచ్‌ఎంసి నిర్వహిస్తున్న రూ.5 భోజనం స్టాల్‌ దగ్గర క్యూ ఉంది. అపుడే సెక్రటేరియట్‌ నుండి స్కూటర్‌ మీద వచ్చిన ఒకాయన చెట్టు కింది బండి ఆపి, లైన్లో నిలబడి, పేద ప్రజల కడుపునింపుతున్న భోజనం కళ్లకద్దుకొని, అపురూపంగా తినసాగారు. ఆయన పేరు ఆళ్ళ రామకష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే.
.సీన్‌ కట్‌ చేస్తే...
 ఇదే తరహాలోనే తన నియోజకవర్గంలో రూ. 4 లకే భోజనం పెట్టే పథకాన్ని మొబైల్‌ క్యాంటీన్ల ద్వారా ప్రారంభించారు ఆర్కే. మంగళగిరి నియోజకవర్గంలో ఈ క్యాంటీన్లు ద్వారా పేదలకు భోజనాన్ని అందించడం మొదలు పెట్టాడు. గౌతమిబుద్ద రోడ్డులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సెంటర్‌ లో తొలి పదిరోజులు, మిగిలినరోజులు తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్‌ లో ఈ క్యాంటీన్‌ ద్వారా భోజనం పేదలకు అందించారు. రూ.4 లకే అన్నం, కూర , పప్పును , 4 రోజుల పాటు కోడిగుడ్డు, మూడు రోజులపాటు అరటిపండు, వడియాలు, వాటర్‌ ప్యాకెట్‌ లను అందించారు. రోజూ ఐదువందల మందికి భోజనాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్న ఈ ఎమ్మెల్యే, పేదల భోజనానికి తన స్వంత డబ్బులను వెచ్చిస్తున్నారు. అంతా బాగుంది కానీ, తరువాత ఏం జరిగింది..? 

జనం కోసం ఆస్తులమ్ముకున్నాడు... ? ఎమ్మెల్యే కాగానే కోట్లకు పడగలెత్తడం కొత్తేమీ కాదు. జీవితంలో ఐదేళ్ళుఎమ్మెల్యేగా వుంటే.. అయిదు తరాలకు సరిపడా సంపాదించుకోవడం నేటి రాజకీయ నీతి.కానీ, ఐదేళ్ళు ఎమ్మెల్యేగావుండి, సొంత ఆస్తుల్ని అమ్ముకొని అప్పులపాలైన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. కానీ తాను అవేం పట్టించుకోకుండా జనం సేవలో తరించి, జన సంక్షేమమే ధ్యేయంగాముందుకు సాగాడు. జనంతో మమేకమై నియోజక వర్గం అభివద్ధి కోసం పాటుపడ్డాడు.

 ''రాజన్న '' క్యాంటీన్‌ పెట్టి ,కేవలం నాలుగు రూపాయలకే పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడంతోనే ఆగి పోలేదు, తన పొలంలో పండించిన ఏడురకాల తాజా కూరగాయలు (సుమారు7కిలోలు) అతి తక్కువ ధరకు ప్రజలకు అందిస్తున్నాడు. రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ,రైతుల కష్టనష్టాలు తెలిసినవాడు. రాజధాని కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ ప్రయత్నం చేసినప్పుడు ,రైతులకు అండగా నిలిచాడు. ధర్మంకోసం, న్యాయం కోసం నిరంతరంగా పోరాడాడు. తన నియోజక వర్గం ప్రజల కోసం పోలీసుల దౌష్ట్యానికి గురయినా, అంతులేని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచాడు . 
రామక ష్ణారెడ్డి నిజాయితీని ప్రజలు మరిచిపోలేదు. ధన, అధికార బలంతో తెలుగుదేశం పార్టీ వారు ఎన్ని ఆశలు చూపినా, తమలో ఒకడిగా, సామన్యుడిగా, తమ అభ్యున్నతే ధ్యేయంగా బతికిన రామకృష్ణా రెడ్డిని గెలిపించుకున్నారు.

 వైఎస్సార్‌ సీపీ అధినేత, వై.ఎస్‌. జగన్‌, మంగళగిరి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టే, 'ఆళ్ళ' కు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు.
 రేపటి జగన్‌ క్యాబినెట్‌లో ఆర్కే వ్యవసాయ శాఖ మంత్రి కాబోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: