మీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా... 

పాదయాత్రలో, పేద వర్కర్లకిచ్చిన మాటను నెరవేర్చిన జగన్‌ ఆశావర్కర్లకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీపి కబురు చెప్పారు.


పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి వారి జీతాలను భారీగా పెంచారు. ఇప్పటి వరకు 3వేలున్న ఆశావర్కర్ల జీతాలను పదివేల రూపాయలకు పెంచుతున్నట్టు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖపై సోమవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టిన వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ స్థాయిలో ఆశావర్కర్ల ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఆశావర్కర్ల ఆనందానికి అవదులు లేవు. వారి జీతాలు భారీగా పెరిగినట్టయింది.


ప్రస్తుతం మూడు వేల రూపాయల వేతనం అందుకుంటున్న ఆశావర్కర్లు.. ఇకపై పదివేల రూపాయల వేతనం అందుకోనున్నారు. ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నప్పుడు వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆశావర్కర్లు తమ సమస్యలను వైఎస్‌ జగన్‌ ముందుంచారు. ఆ సమయంలో వారికి ఇచ్చిన హామీ మేరకు వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: