జోమాటోలో ఆహారాన్ని ఆర్డర్ చేసిన తరువాత, ఒక కస్టమర్ దానిని హిందూ రైడర్ ద్వారా మాత్రమే పంపాలని కోరుకున్నాడు. డెలివరీ ఎగ్జిక్యూటివ్ యొక్క మతం ఆధారంగా జోమాటో తన ప్రాధాన్యతను ఒప్పుకోవడానికి నిరాకరించింది. దానితో కస్టమర్ తన ఆర్డర్ను రద్దు చేసి తను కట్టీన డబ్బును తిరిగి ఇవ్వమని జోమాటోను కోరారు. జోమాటో సరి అయిన కారణం లేనందున డబ్బులు తిరిగి ఇవ్వదానికి ఒప్పుకోలెదు.
దానితో కస్టమర్ ట్విట్టర్లోకి వెళ్లి ఆర్డర్ను రద్దు చేసిన తర్వాత జోమాటో వాపసును ప్రాసెస్ చేయలేదని పేర్కొన్నారు. కస్టమర్ మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందినవాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే జోమాటో దాని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఈ కస్టమర్ యొక్క ట్వీట్కు సమాధానం ఇస్తూ “ఆహారానికి మతం లేదు ” అని చెప్పారు.
జోమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ కూడా ఈ సంభాషణలో చేరారు. అటువంటి మత వివక్షకు జోమాటోకు చోటు లేదని, మతం ఆధారంగా డెలివరీ ఎగ్జిక్యూటివ్లను ఎన్నుకునే అవకాశాన్ని కోరుకునే వినియోగదారులకు తాము ఎప్పుడు ఒప్పుకోమని ఆ విషయం ఆయన స్పష్టం చేశారు.
We are proud of the idea of India - and the diversity of our esteemed customers and partners. We aren’t sorry to lose any business that comes in the way of our values. 🇮🇳 https://t.co/cgSIW2ow9B
— Deepinder Goyal (@deepigoyal) July 31, 2019