ఈ మద్య కామాంధులు ఎక్కడ బడితే అక్కడ రెచ్చిపోతున్న విషయం తెలిసిందే.  ఈ మేరకు పోలీసులు ఎంత గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నా..ముఖ్య నగరాల్లో ఎన్ని సీక్రెట్ కెమెరాలు పెడుతున్నా సరే..ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కొంత మంది మృగాళ్లో మార్పులు రావడం లేదు. ఇటీవల హన్మకొండలో తల్లివడిలో పడుకున్న తొమ్మదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి దారుణంగా అత్యాచారం చేసి గొంతునులిమి చంపిన రాక్షసుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది.

అలాగే వరుసగా ముగ్గురు అమ్మాయిలను దారుణంగా అనుభవించి చంపి బావిలో పూడ్చి పెట్టిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ని సైతం ఉరి తీయాలని మహిళా సంఘాలు కోరుకుంటున్నాయి. అలాగే హన్మకొండలో మైనర్ బాలికను నమ్మించి మోసం చేసి ముగ్గురు అత్యాచారం చేయగా ఆ బాలిక అవమానంతో ఆత్మహత్య చేసుకుంది..ఇలాంటి ఉదంతాలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రానికే గర్వకారంగా నిలిచిన విద్యావ్యవస్థ ఉస్మానియా యూనివర్సిటి.  అలాంటి ఓయూ లేడీస్ హాస్టల్‌లో విద్యార్థినులకు భద్రత కరువైంది. ఆర్థరాత్రి ఓ ఆగంతకుడు హాస్టల్‌లోకి ప్రవేశించి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. 


అందుతున్న సమాచారం మేరకు గురువారం అర్థరాత్రి సమయంలో హాస్టల్‌లోకి చొరబడిని గుర్తు తెలియని వ్యక్తి ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఆమెను కత్తితో బెదిరించాడు.  తెల్లవారుజామున 3 గంటలకు ఆగంతకుడు ఓయూ లేడీస్ హాస్టల్ లోకి ప్రవేశించాడు. అదే సమయంలో బాత్రూకని వెళ్లిన విద్యార్థినిని గమనించి.. బాత్రూం బయట గడి పెట్టి లోపల దూకాడు.


ఆ యువతిని అరిచావంటే కత్తితో పొడిచేస్తా అంటూ బెదిరించి అసహ్యంగా ప్రవర్తించాడని..దాంతో భయంతో ఆ  ఆమె గట్టిగా కేకలు వేయడంతో.. మిగిలిని విద్యార్థినులు పరుగెత్తుకు వచ్చారు. తనకు ప్రమాదం పొంచి ఉందని తెలిసిన దుండగుడు బాధితురాలి సెల్ ఫోన్ లాక్కుని పారిపోయాడు. ఘటనపై ఓయూ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని సెల్ ఫోన్ ను హాస్టల్ ప్రహరి గోడ దగ్గర ఉన్నట్లు గుర్తించారు. ఇక ఆగంతకుడు ఎవరనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: