వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై ఘాటు విమర్శలు చేశారు. అతని గురించి అతనికే తెలియని నిజాలను తెలియజేశారు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ట్విట్టర్ లో ఏదొక సంఘటన గురించి ట్విట్ చేసే విజయసాయి రెడ్డి ఈరోజు సుజనా చౌదరిపై మండిపడ్డారు. పదవి కోసం పార్టీ మారే మీరు సుద్ద పూసల మీరు మాట్లాడితే ప్రజలు నవ్వుతారు సుజనా చౌదరి అంటూ ఆయనపై ధ్వజమెత్తారు విజయసాయి రెడ్డి. 


విజయ సాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'మీ రాజకీయ జీవితమంతా చౌకబారు విన్యాసాలే గదా సుజనా చౌదరి గారూ? రెండు సార్లు రాజ్యసభ సభ్యుడవడానికి, కేంద్ర మంత్రి పదవి కోసం ఛంద్రబాబు గారికి ఎంత కప్పం కట్టారో బహిరంగ రహస్యమే. ఢిల్లీలో కూడా అందరికీ తెలుసు. అలాంటి మీరు సుద్దపూసలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారుసుజనా చౌదరి.'  అంటూ ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ చుసిన నెటిజన్లు స్పందిస్తూ 'సార్ దేశంమొత్తం తెలుసు నిన్నగాక మొన్న పార్టీ మారిన వ్యక్తులగురించి, ఢిల్లీలో సైకిల్ చక్రం తిరిగుంటే బీజేపీ ఓడిపోయుంటే టీడీపీ నుండి జంప్ చేసేవారా! బీజేపీ రాగానే బ్యాంక్ కేసులు,అమరావతి భూదందా పనులు ఎక్కడ బయటపడతాయో అని భయంతో జెండా మార్చారు! ఏపీ ప్రజలకు అన్నీతెలుసు. తెలియదనుకుంటే అది వారి పొరపాటు.!' అంటూ ఫైర్ అయ్యారు నెటిజన్లు.  


మరింత సమాచారం తెలుసుకోండి: