వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ తెలుగు దేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించి ప్రతిపక్షాల పార్టీ నాయకులకు ఝలక్ లు ఇస్తుంటాడు విజయసాయి రెడ్డి. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులు ప్రతిపక్ష నేతలు ఓపిక పట్టాలని, ముఖ్యమంత్రి జగన్ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తానని మాట ఇచ్చారని గుర్తు చేశారు.  


విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''కొద్ది రోజులు ఓపిక పట్టు ఉమా. రివర్స్ టెండర్లు, జ్యుడిషల్ కమిషన్ వల్ల ఫలితాలెలా ఉంటాయో తెలుస్తుంది. మీ వేల కోట్ల దోపిడీ కూడా బయట పడుతుంది. నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు. మేం ప్రజలకు జవాబుదారులం. పచ్చ దొంగలకు కాదు.'' అంటూ ట్విట్ చేసి పచ్చ పార్టీ నాయకులకు ఝలక్ ఇచ్చాడు విజయసాయి రెడ్డి. 


ఈ ట్విట్ పై నెటిజన్లు స్పందిస్తూ ' మంచి నిర్ణయం సార్ 'గత 5 సంవత్సరాలలో జరిగిన అన్ని స్కామ్ లు బయట పెట్టండి సార్. ప్రజలకు అన్ని తెలియాలి, వాళ్లకు యెల్లో మీడియా ఉంది. అందులో అన్ని అబద్దాలు చూపిస్తున్నారు. కొన్ని ఛానళ్లలో టీడీపీ వాళ్లతో డిబెట్స్ పెట్టి తప్పుడు వార్తలన్నీ ప్రజలకు చూపిస్తున్నారు. మీరు యాక్షన్ తీసుకోండి సర్' అంటూ ట్విట్ పెట్టి టీడీపీ నేతలపై మండిపడుతున్నారు నెటిజన్లు. 



మరింత సమాచారం తెలుసుకోండి: